శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి బ్యాగు మాయమైంది.
శంషాబాద్ ఎయిర్ పోర్టులో బ్యాగు మాయం
Feb 24 2016 11:17 AM | Updated on Sep 3 2017 6:20 PM
శంషాబాద్ : శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి బ్యాగు మాయమైంది. బుధవారం ఉదయం ముంబై నుంచి శంషాబాద్కు వచ్చిన అబ్బసలాం అనే వ్యక్తి బ్యాగు కనిపించక పోవడంతో అతను ఎయిర్పోర్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బ్యాగులో పాస్పోర్ట్, సెల్ఫోన్, విలువైన వస్తువులు ఉన్నాయని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు సీసీ ఫుటేజీను పరిశీలిస్తున్నారు.
Advertisement
Advertisement