
రోగనిరోధక శక్తిని పెంచి ఆరోగ్యాన్ని పెంపొందించే బొప్పాయి మేని నిగారింపులోనూ మెరుగైన ఫలితాలను అందిస్తుంది.
►బొప్పాయి గుజ్జుతో ప్యాక్ వేసుకుంటే మలినాలు తొలగిపోతాయి. చేతులు, పాదాలపై ఉన్న ట్యాన్ వదిలిపోతుంది.
►అరకప్పు బొప్పాయి గుజ్జులో టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని పాదాలు, చేతులు, ముఖానికి రాసి మసాజ్ చేయాలి. పదినిమిషాల తర్వాత వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. మృతకణాలు తొలగిపోయి చర్మం మృదుత్వం పెరుగుతుంది. పొడిబారిన చర్మానికి ఇది మేలైన ప్యాక్.
►టేబుల్ స్పూన్ బొప్పాయి గుజ్జులో టీ స్పూన్ తేనె కలిపి ముఖానికి రాయాలి. పదిహేను నిమిషాల తర్వాత వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
వారంలో మూడుసార్లయినా ఇలా చేయడం వల్ల చర్మం జిడ్డు తగ్గి, నిగారింపు పెరుగుతుంది.