ప్రవక్త జీవితం
ప్రార్థన పూర్తయిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా, ‘ఏమిటిది? ఏదో కొత్తకొత్తగా ఉంది. ఎందుకిలా చేస్తున్నారు?’ అని ప్రశ్నించాడు అలీ ఏమాత్రం తడుముకోకుండా.
‘ఇది దేవుడు మానవుల కోసం పంపిన ధర్మం బాబూ! అనాదిగా ప్రవక్తలంతా లోకానికి ఇదే ధర్మాన్ని బోధిస్తూ వచ్చారు. ఇప్పుడు మానవులు అనుసరించాల్సిన ధర్మం ఇదే..!’ అన్నారు ముహమ్మద్ (స).
‘మరి ఈ రుకూలు, సజ్దాలేమిటి?’ మరో ప్రశ్న సంధించాడు ఆ బాలుడు.
‘బాబూ! దేవుడు నన్ను తన ప్రవక్తగా నియమించాడు. నాపై తన వాక్కును అవతరింపజేశాడు. నేను ప్రజలకు మంచి విషయాలు బోధించాలని, సన్మార్గం తప్పి అజ్ఞానాంధకారంలో తచ్చాడుతున్న ప్రజలకు సన్మార్గం చూపాలని, దైవారాధన వైపుకు ప్రజల్ని ప్రేరేపించాలని దేవుడు నాపై తన వాణిని అవతరింపజేస్తున్నాడు. ఈ రుకూలు, సజ్దాలన్నీ ఆ దైవం కోసమే..!’ వివరించారు ముహమ్మద్ (స).
‘చాలా బాగుంది. ఈ ఆరాధనా విధానం నాకు బాగా నచ్చింది. మరి నేను కూడా మీరు నమ్మిన దైవాన్ని నమ్మవచ్చా? మీకులాగానే దైవాన్నిఆరాధించవచ్చా? మీ వెంట నేను కూడా నమాజ్ చేయవచ్చా?’ అని ప్రశ్నించాడు.
‘తప్పకుండా బాబూ! అలాగే చేయి. సమస్త మానవాళికీ దేవుడు ఒక్కడే, ఆయనకెవ్వరూ భాగస్వాములు లేరు. ఆయనే ఆరాధనలకు అర్హుడు. నువ్వు కూడా ఆయన్నే ఆరాధించు. విగ్రహారాధన వదిలిపెట్టు’ అన్నారాయన.
‘సరే, అయితే నాన్నగారిని కూడా ఒక మాట అడిగి మీకు చెబుతాను.’
‘సరే అలాగే. నాన్నగారితో మాట్లాడు. ఏ విషయమైనా పెద్దవాళ్లను సంప్రదించడం మంచి పద్దతి’ అన్నారాయన.
నాన్నగారిని అడిగి చెపుతానని అన్నాడేగాని, అలీకి ఆ రాత్రి అసలు నిద్రే పట్టలేదు. దాదాపు తెల్లవార్లూ మెలకువతోనే ఉన్నాడు. ముహమ్మద్ (స) చెప్పిన మాటలే మాటిమాటికీ గుర్తుకొస్తున్నాయి. ఆయన ఆచరించిన నమాజ్ దృశ్యాలే కళ్లలో మెదులుతున్నాయి. ఆలోచనలతోనే తెల్లారిపోయింది.
వెంటనే ఆయన ముహమ్మద్ (స) దగ్గరికొచ్చి, ‘నేను మిమ్మల్ని, మీరు ఆచరించే ధర్మాన్ని విశ్వసిస్తున్నాను. నాకు ప్రార్ధనా విధానం నేర్పండి’ అన్నాడు.
‘నాన్నగారితో మాట్లాడావా?’ అన్నారు ముహమ్మద్ (స) .
‘నాన్నగారిని సంప్రదించాలనుకున్నాను కాని, ఆ అవసరం కనిపించలేదు’.
అలీ నిర్ణయం పట్ల ముహమ్మద్ (స) సంతోషించారు. ప్రేమతో గుండెలకు హత్తుకున్నారు. ప్రార్థనా విధానం నేర్పారు. అప్పటి వరకూ అవతరించిన దైవ వాణిని అలీకి నేర్పించారు. ఇక అప్పటినుండి క్రమం తప్పకుండా అలీ కూడా ముహమ్మద్ (స)తో కలిసి నమాజ్ ఆచరించడం మొదలుపెట్టారు.
- ముహమ్మద్ ఉస్మాన్ఖాన్ (మిగతా వచ్చేవారం)
అవును, మీరు సత్యసంధులు...
Published Sun, Jul 17 2016 12:58 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కార్మికవర్గం ఎన్నికల్లో బీజేపీకి బుద్ధిచెప్పాలి
రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య
12 గుర్తింపు కార్డుల్లో ఏదైనా చూపించొచ్చు
యువకుడి ఆత్మహత్య
ఇదా చంద్రబాబు మేనిఫెస్టో అని మోదీ కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నాడు
పట్టభద్రుల స్థానానికి 14 మంది నామినేషన్
రిసెప్షన్ సెంటర్ల వద్ద పకడ్బందీ ఏర్పాట్లు
పేదలకు ఉచితంగా.. కార్పొరేట్ విద్య
ఎన్నికల్లో సూక్ష్మ పరిశీలకుల పాత్ర కీలకం
వైఎస్సార్సీపీలో 70 కుటుంబాల చేరిక
తప్పక చదవండి
- ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- నేడు ఏపీలో ప్రధాని ఎన్నికల ప్రచారం
- పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- బీజేపీ ఖైదీగా శ్రీరాముడు
- Telangana: మరో రెండు రోజులు వానలు
- మండుటెండల్లోనూ నిండా ముంచే..రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యం
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement