సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ముందునుంచి ఊహించినట్లుగానే ఆంధ్రప్రదేశ్లో వైెెఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణ ప్రాంతంలో టీఆర్ఎస్ ఆధిక్యం సాధిస్తోంది.
సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ముందునుంచి ఊహించినట్లుగానే ఆంధ్రప్రదేశ్లో వైెెఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణ ప్రాంతంలో టీఆర్ఎస్ ఆధిక్యం సాధిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా భూస్థాపితం అవుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో మాత్రం కొద్దిమేర తన ఉనికిని చూపించుకుంటోంది.
ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం అసెంబ్లీ నియోజకవర్గాల్లో 60 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 41 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ ఆధిక్యంలో ఉన్నాయి. పార్లమెంటు నియోజకవర్గాల్లో తొమ్మిదింట వైఎస్ఆర్ కాంగ్రెస్, ఏడు చోట్ల మాత్రం తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఆధిక్యం కనబరుస్తున్నారు.