టీడీపీయే బీ ఫాం ఇచ్చింది: శైలజానాథ్ | TDP be form has given, says Sailajanath | Sakshi
Sakshi News home page

టీడీపీయే బీ ఫాం ఇచ్చింది: శైలజానాథ్

Apr 23 2014 5:05 AM | Updated on Sep 2 2017 6:23 AM

టీడీపీయే బీ ఫాం ఇచ్చింది: శైలజానాథ్

టీడీపీయే బీ ఫాం ఇచ్చింది: శైలజానాథ్

తాను కోరకపోయినా టీడీపీయే బీఫాం ఇచ్చిం దని మాజీ మంత్రి, శింగనమల అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి సాకే శైలజానాథ్ స్పష్టం చేశారు.

శింగనమల కాంగ్రెస్ అభ్యర్థి శైలజానాథ్
 అనంతపురం, న్యూస్‌లైన్: తాను కోరకపోయినా టీడీపీయే బీఫాం ఇచ్చిం దని మాజీ మంత్రి, శింగనమల అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి సాకే శైలజానాథ్ స్పష్టం చేశారు. మంగళవారం విలేకరులతో మాట్లాడారు. తాను కాంగ్రెస్ పార్టీ నుంచి మారుతున్నట్లు వస్తున్న వార్తలన్నీ ఊహాగానాలేనని కొట్టిపారేశారు. శింగనమల అసెంబ్లీ స్థానానికి టీడీపీ నుంచి బీ ఫాం వచ్చిన మాట వాస్తవమేనని, అది తరిమెల కోనారెడ్డి వద్దే ఇప్పటికీ ఉందన్నారు. తాను టీడీపీ తరఫున పోటీ చేసేందుకు ఇష్టపడటంలేదన్నారు. ఆ పార్టీ తరఫునే నామినేషన్ వేయాలనుకుంటే బహిరంగంగా ప్రకటించేవాడినని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement