అప్పుడే ఎందుకు చేయలేదు? | m venkaiah naidu takes on chandrababu naidu | Sakshi
Sakshi News home page

అప్పుడే ఎందుకు చేయలేదు?

Mar 25 2014 7:59 PM | Updated on Jul 28 2018 3:33 PM

అప్పుడే ఎందుకు చేయలేదు? - Sakshi

అప్పుడే ఎందుకు చేయలేదు?

సీమాంధ్రను సింగపూర్ చేస్తానని చెబుతున్న టీడీపీ అధినేత చంద్రబాబుపై బీజేపీ సీనియర్ నాయకుడు ఎం. వెంకయ్య నాయుడు విమర్శలు గుప్పించారు.

న్యూఢిల్లీ: సీమాంధ్రను సింగపూర్ చేస్తానని చెబుతున్న టీడీపీ అధినేత చంద్రబాబుపై బీజేపీ సీనియర్ నాయకుడు ఎం. వెంకయ్య నాయుడు విమర్శలు గుప్పించారు. తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు సింగపూర్‌ లాంటి నగరాలను ఎందుకు కట్టలేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా ఉండగా ఒక్కో కుటుంబానికి ఒక్కో ఉద్యోగం ఎందుకివ్వలేదని నిలదీశారు.

టీడీపీ మాత్రమే పెద్ద పార్టీ అనుకోవద్దని చురక అంటించారు. తాము ఎవరికి అంటరాని వాళ్లం కాదని, ఎవరొచ్చినా చేర్చుకుంటామని చెప్పారు. దక్షిణ భారతంలోని తమిళనాడు, కేరళ, ఆంధ్రా, కర్నాటకలో మోడీ ప్రభంజనం అధికంగా ఉందని, మోడీ పీఎం కావడం తథ్యమని వెంకయ్య నాయుడు ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement