- ఒకే రోజు పోటెత్తిన అగ్ర నాయకులు నర్సాపూర్లో సుష్మా..
- సంగారెడ్డిలో ఆజాద్ నారాయణఖేడ్, జహీరాబాద్,
- జోగిపేటలో కేసీఆర్
- జహీరాబాద్లో చంద్రబాబు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఎన్నికల వేళ మెతుకుసీమకు అగ్రనాయకులు పోటెత్తారు. పోలింగ్కు కేవలం మూడే రోజులు మిగిలి ఉండటంతో జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులు జిల్లాకు వరుస కట్టారు. కుదిరితే హెలికాప్టర్లో.. లేకుంటే రోడ్డు మార్గంలో ‘దౌడ్’ తీస్తున్నారు. శనివారం బీజేపీ జాతీయ నాయకురాలు సుష్మాస్వరాజ్ నర్సాపూర్లో పర్యటించారు. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ నారాయణఖేడ్, జహీరాబాద్, అందోల్ నియోజకవర్గాల్లో పర్యటించారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు గులాంనబీ ఆజాద్ సంగారెడ్డి నియోజకవర్గంలో తిరిగారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జహీరాబాద్లో పర్యటించారు.
రాజకీయ అనిశ్చితిలో కేసీఆర్: సుష్మాస్వరాజ్
నర్సాపూర్ సభలో సుష్మాస్వరాజ్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ కేసీఆర్ మీద విమర్శనాస్త్రాలు సంధించారు. కేసీఆర్ ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో పోటీ చేయడం చూస్తుంటే రాజకీయ అనిశ్చితిలో కూరుకుపోయినట్టు అర్థమవు తుందన్నారు. ‘రాష్ర్టంలో టీఆర్ఎస్ వస్తే ఇక్కడ ముఖ్యమంత్రి కావాలని చూస్తున్నారు, లేకుంటే కేంద్రంలో మంత్రి పదవి తీసుకోవాలనుకుంటున్నారు. కానీ ఆయన కలలు నేరవేరవు. ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం రాదు, కేంద్రంలో మోడీ ప్రభుత్వం రావడం ఖాయం. ఆంధ్రకు నీళ్లను ఇవ్వను అని పంచాయితీ పెట్టుకునే బదులు నదీ జలాలను తెలంగాణకు ఏవిధంగా వినియోగించుకోవాలో ఆలోచన చేస్తే మంచిది’ అని ఆమె అన్నారు.
గీతారెడ్డి ఫైవ్స్టార్ మినిష్టర్: కేసీఆర్
జహీరాబాద్, నారాయణఖేడ్, అందోల్ నియోజకవర్గాల్లో పర్యటించిన కేసీఆర్ మాజీ మంత్రి గీతారెడ్డి మీద విరుచుకుపడ్డారు. గీతారెడ్డి ఫైవ్స్టార్ మినిష్టర్ అని, ఆమె సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండరని విమర్శించారు. త్వరలోనే జైలుకు వెళ్లబోయే గీతారెడ్డికి ఓటు వేస్తే దండగేనని జహీరాబాద్ ప్రజలను ఉద్దేశించి అన్నారు.
అందోల్లో కేసీఆర్ వచ్చే సమయానికి సభా వద్ద జనం పలుచగా ఉండటంతో ఆయన కేవలం నాలుగే నిమిషాలు ప్రసంగించారు. ఎన్నికల తర్వాత టీఆర్ఎస్.. బీజేపీతో కలవదని తేల్చి చెప్పారు. గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా చేస్తూ తొలి సంతకం చేస్తానని హామీ ఇచ్చారు.
మరోసారి అవకాశం ఇవ్వండి: ఆజాద్
సంగారెడ్డిలో గులాంనబీ ఆజాద్ మాట్లాడుతూ.. సెక్యులర్ భావాలు కలిగిన ఏకైక పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. సంగారెడ్డి నియోజకవర్గాన్ని జగ్గారెడ్డి అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని, ఐఐటీ తెచ్చింది కాంగ్రెస్ పార్టీయే అని అన్నారు. మరో మారు అవకాశం ఇస్తే మెట్రో రైలు కూడా పట్టుకొస్తారని అన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించి, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ఆయన కోరారు.
మెతుకుసీమలో నేతల దౌడ్
Published Sun, Apr 27 2014 2:15 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
త్రినయని సీరియల్ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్ (ఫోటోలు)
స్టార్ హీరో గొప్పమనసు.. రూ. కోటి చెక్ విరాళం!
ఎరక్కపోయి ఇరుక్కుపోయి
మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
కేఎల్ రాహుల్ మాస్టర్ ప్లాన్.. మెక్ గర్క్ సిల్వర్ డక్! వీడియో
Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్గా మళ్లీ కోహ్లినే!
రామ్- పూరి కాంబో.. డబుల్ మాస్ అప్డేట్ వచ్చేసింది!
స్వాతి మలివాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
'ఆ రూలే ఐపీఎల్ను మార్చేసింది.. వారు పునరాలోచనలో పడ్డారు'
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement