బీజేపీలో సోదరుడి చేరిక బాధించింది | Brother hurt in addition BJP | Sakshi
Sakshi News home page

బీజేపీలో సోదరుడి చేరిక బాధించింది

Apr 27 2014 4:32 AM | Updated on Mar 29 2019 9:24 PM

బీజేపీలో సోదరుడి చేరిక బాధించింది - Sakshi

బీజేపీలో సోదరుడి చేరిక బాధించింది

బీజేపీలో తన సవతి సోదరుడు దల్జీత్‌సింగ్ కోహ్లీ చేరడం బాధించిందని ప్రధాని మన్మోహన్‌సింగ్ తెలిపారు. ‘‘నాకు చాలా బాధగా ఉంది.

ప్రధాని మన్మోహన్‌సింగ్ ఆవేదన

న్యూఢిల్లీ/అమృత్‌సర్: బీజేపీలో తన సవతి సోదరుడు దల్జీత్‌సింగ్ కోహ్లీ చేరడం బాధించిందని ప్రధాని మన్మోహన్‌సింగ్ తెలిపారు. ‘‘నాకు చాలా బాధగా ఉంది. కానీ నేనెవరినీ కట్టడి చేయలేను. వాళ్లంతా పెద్దవాళ్లు’’ అని శనివారం ఢిల్లీ లో పద్మ పురస్కారాల ప్రదానం సందర్భంగా ఈ అంశంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు మన్మోహన్ బదులిచ్చారు. ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారం చేపడుతుందని...యూపీఏ-3 ప్రభుత్వ ఏర్పాటు అసాధ్యం కాదని పునరుద్ఘాటించారు. మరోవైపు దల్జీత్ చేరికను బీజేపీ ప్రచారాంశంగా చేసుకోవడాన్ని కాంగ్రెస్ తప్పుబట్టింది. బీజేపీ అగ్ర నేత, మాజీ ప్రధాని వాజ్‌పేయి సోదరుడి కూతు రు కరుణా శుక్లా తమ పార్టీలో చేరినప్పుడు ఆ అంశాన్ని తాము దేశమం తా ప్రచారం చేసుకోలేదని కాంగ్రెస్ ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ గుర్తుచేశారు.
 
కాంగ్రెస్‌కు ప్రధాని మరో సోదరుడి మద్దతు

 ప్రధాని మన్మోహన్ మరో సవతి సోదరుడు సుర్జీత్‌సింగ్ కోహ్లీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికారు. పంజాబ్ మాజీ సీఎం, కాంగ్రెస్ పార్టీ అమృత్‌సర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న అమరిందర్‌సింగ్ నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement