'మేం మా బిడ్డలకు గోరు ముద్దలు పెట్టొద్దా' | why are you accupying our land: laxmareddy | Sakshi
Sakshi News home page

'మేం మా బిడ్డలకు గోరు ముద్దలు పెట్టొద్దా'

Aug 26 2015 11:18 AM | Updated on Jul 25 2018 4:07 PM

'మేం మా బిడ్డలకు గోరు ముద్దలు పెట్టొద్దా' - Sakshi

'మేం మా బిడ్డలకు గోరు ముద్దలు పెట్టొద్దా'

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ఇంకా భూముల ఆక్రమణ దాహం తీరనట్లుందని రైతు కూలి సంఘం నేత లక్ష్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ఇంకా భూముల ఆక్రమణ దాహం తీరనట్లుందని రైతు కూలి సంఘం నేత లక్ష్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా విజయవాడ సీఆర్ డీఏ కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న ధర్నాలో ఆయన మాట్లాడుతూ తమ భూములు లాక్కోవద్దని మూకుమ్మడిగా చెప్తున్నా ఎలా లాక్కుంటారని ప్రశ్నించారు.

ఇదే మట్టిలో నుంచి పండించిన పంటలు చంద్రబాబు తల్లి ఆయనకు గోరు ముద్దలు తినిపించిందని, అలాంటి నేలలో పంటలు పండించుకొని తమ బిడ్డలకు మేం గోరు ముద్దలు పెట్టుకోవద్దా అని నిలదీశారు. అసలు అక్రమంగా ఎన్ని భూములు తీసుకుంటారని ప్రశ్నించారు. తమలాంటి పేద రైతుల కష్టాలను గుర్తించి అండగా ఉండేందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి వచ్చారని, ఆయనకు తాము మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement