కలెక్టర్‌తో శ్రీనివాస్‌గౌడ్ భేటీ | TRS MLA Srinivas Goud meet with Collector | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌తో శ్రీనివాస్‌గౌడ్ భేటీ

Oct 27 2016 5:19 AM | Updated on Mar 21 2019 7:27 PM

కలెక్టర్‌తో శ్రీనివాస్‌గౌడ్ భేటీ - Sakshi

కలెక్టర్‌తో శ్రీనివాస్‌గౌడ్ భేటీ

జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్‌ను గెజిటెడ్ అధికారుల సంఘం గౌరవాధ్యక్షుడు, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్

ఖమ్మం సహకారనగర్ : జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్‌ను గెజిటెడ్ అధికారుల సంఘం గౌరవాధ్యక్షుడు, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు.  బుధవారం ఖమ్మం జిల్లాకు వచ్చిన సందర్భంగా తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా నేతలతో కలిసి కలెక్టర్‌ను కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై కలెక్టర్‌తో మాట్లాడారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు ఆళ్ల శ్రీనివాసరెడ్డి, గౌరవాధ్యక్షుడు షేక్ ఖాజామియా పాల్గొన్నారు.  
 
 నేడు టీఎస్‌పీఎస్సీ సభ్యుడి పర్యటన
 ఖమ్మం సహకారనగర్: టీఎస్‌పీఎస్సీ సభ్యుడు బి.మన్మథరెడ్డి గురువారం జిల్లాలో పర్యటించనున్నట్లు పరీక్షల జిల్లా కోఆర్డినేటర్ వెంకట రామారావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నవంబర్ 11, 13వ తేదీల్లో జరిగే గ్రూప్-2 పరీక్ష నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్షించనున్నారు. సమావేశానికి గ్రూప్-2 పరీక్షలకు నియమించిన చీఫ్ సూపరింటెండెంట్లు, లైజన్ అధికారులు, సం బంధిత శాఖాధికారులు హాజరుకావాలని కోరారు.
 
 కబడ్డీ పోటీల్లో ఖమ్మం జట్టు ముందంజ    
 కరీంనగర్ స్పోర్‌‌ట్స: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వివేకానంద రెసిడెన్షియల్ స్కూల్‌లో సీబీఎస్‌ఈ స్కూల్ క్లస్టర్ కబడ్డీ పోటీలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ పోటీల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి 13 బాలురు, 5 బాలికల జట్లు పాల్గొంటున్నాయి. 200 మంది క్రీడాకారులు 50 మంది అధికారులు హాజరయ్యారు. కాగా, తొలిరోజు బాలుర విభాగంలో చైతన్య సెంట్రల్‌స్కూల్ (మహబూబ్‌నగర్)పై హార్వెస్ట్ పబ్లిక్ స్కూల్ (ఖమ్మం) 52-28 తేడాతో విజయం సాధించింది.  
 
 డిజిటల్ ఇండియా పోటీల్లో జిల్లా విద్యార్థుల ప్రతిభ
 ఖమ్మం జెడ్పీసెంటర్: ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో కాకతీయ యూనివర్సిటీలో నిర్వహించిన నేషనల్ ఈ గవర్నస్ డివిజన్ డిజిటల్ ఇండియా ప్రతిభా పోటీల్లో జిల్లాకు చెందిన ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. పోటీల్లో ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ డిగ్రీకళాశాల విద్యార్థులు ప్రదర్శించిన ఈ-హాస్పిటల్ నాటికకు ప్రథమబహుమతి లభించింది. పోటీల్లో ఉత్తమ ప్రదర్శనచేసి బహుమతి పొందిన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వీరభద్ర య్య బుధవారం కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్ జిల్లా సమన్వయకర్త జగదీశ్వరరావు, ప్రోగ్రామ్ అధికారులు చంద్రశేఖర్, సర్వేశ్వర్‌రావును అభినందించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement