తుర్కపల్లి : రెండు బైక్లు ఢీకొని ముగ్గురికి తీవ్రగాయలైన సంఘటన తుర్కపల్లి మండలం రాంపూర్లో సోమవారం చోటు చేసుకుంది.
రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు
Sep 26 2016 10:29 PM | Updated on Aug 30 2018 4:10 PM
తుర్కపల్లి : రెండు బైక్లు ఢీకొని ముగ్గురికి తీవ్రగాయలైన సంఘటన తుర్కపల్లి మండలం రాంపూర్లో సోమవారం చోటు చేసుకుంది. తుర్కపల్లి మండలానికి చెందిన యేడవల్లి ప్రశాంత్, షేక్ షాదుల్లా, తుర్కపల్లి నుంచి భువగిరికి వైపు వెళ్తుండగా పల్లెపహాడ్కు చెందిన ఇంద్రపాల బాల్రాజు తుర్కపల్లి వైపు వస్తున్న క్రమంలో ఎదురెదురుగా వచ్చిన బైకులు ఢీకొన్నాయి. దీంతో ప్రశాంత్, బాల్రాజుకు తీవ్ర గాయాలుకాగా, షాదుల్లాకు స్వల్ప గాయాలైయ్యాయి. వీరిని అత్యవసర చికిత్స నిమిత్తం భువగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు.
Advertisement
Advertisement