ఐపీఎస్ఎఫ్ వరల్డ్ కాంగ్రెస్లో మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఔషధ రంగానికి రాజధానిగా తెలంగాణకు, ప్రత్యేకించి హైదరాబాద్కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. ఇంటర్నేషనల్ ఫార్మాస్యూటికల్ స్టూడెంట్స్ ఫెడరేషన్ (ఐపీఎస్ఎఫ్), ఇండియన్ ఫార్మాస్యూటికల్ అసోసియేషన్ సంయుక్తంగా శుక్రవారం హోటల్ మారియట్లో 61వ వరల్డ్ కాంగ్రెస్-2015ను నిర్వహించాయి. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. దేశమంతటా తయారవుతున్న బల్క్ డ్రగ్స్లో తెలంగాణ నుంచే 40 శాతం ఉత్పత్తి జరుగుతోందన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా వినియోగిస్తున్న వ్యాక్సిన్లలో మూడోవంతు టీకాలు హైదరాబాద్లో ఉత్పత్తి చేసినవేనన్నారు. ఇండియాతో పాటు అన్ని దేశాలు పరిశోధనల కోసం అధికంగా నిధులు వెచ్చిస్తున్నాయని, అయితే సమాజానికి మేలు చేయని పరిశోధనల వలన ఎటువంటి ప్రయోజనం లేదని పేర్కొన్నారు. ప్రజలకు తక్కువ ఖర్చుతో ఎక్కువ విలువైన ఔషధాలను అందించాల్సిన కర్తవ్యం ఔషధ రంగ నిపుణులపై ఉందన్నారు. హైదరాబాద్లో లైఫ్సెన్సైస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఏరోస్పేస్ రంగాల అభివృద్ధి శరవేగంగా జరుగుతోందని, వివిధ రంగాల్లో పెట్టుబడి పెట్టాలనుకునే వారికోసం రాష్ట్ర ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానాన్ని తెచ్చిందన్నారు.
సాంకేతిక పరిజ్ఞానంతో ఔషధ రంగ పరిశోధనల ఫలితాలను మేళవించి సమాజానికి మేలు జరిగే విధంగా కొత్త ఆవిష్కరణలు తెచ్చేందుకు ఈ సదస్సు దోహదపడాలని కేటీఆర్ ఆకాంక్షించారు. ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ సురేశ్ మాట్లాడుతూ.. భారతీయ ఔషధ మండలిలో 10 లక్షల మంది ఔషధ రంగ నిపుణులు తమ పేర్లు నమోదు చేసుకున్నారని ప్రకటించారు. ఏటా లక్షమంది ఫార్మసీ విద్యను అభ్యసిస్తున్నారన్నారు.
కార్యక్రమంలో టీఎస్ఐఐసీ ఉపాధ్యక్షుడు నర్సింహారె డ్డి, ఇండియన్ ఫార్మాస్యూటికల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ రావు వడ్లమూడి, ఉపాధ్యక్షుడు టీవీ నారాయణ, ఐపీఎస్ఎఫ్ అధ్యక్షురాలు పరాంక్, వరల్డ్ కాంగ్రెస్-2015 చైర్పర్సన్ నేహా దెంబ్లా, ప్రోగ్రామ్ కన్వీనర్ జైపాల్రెడ్డి, ఎమ్మెల్సీ రాజేశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో పలు ఫార్మసీ కళాశాలల విద్యార్థులు, 55 దేశాల నుంచి 350 మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు.
ఔషధ రాజధానిగా తెలంగాణ
Published Sat, Aug 1 2015 2:37 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కమల్ హాసన్పై లింగుస్వామి ఫిర్యాదు
"అతడొక యార్కర్ల కింగ్.. వరల్డ్కప్కు ఎందుకు సెలక్ట్ చేయలేదు"
ఎన్నికల తనిఖీలు: భారీగా బంగారం, వెండి పట్టివేత
అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు.. మరో వ్యక్తి అరెస్ట్
కనిగిరి.. జనగిరి: జగన్ కోసం జనం సిద్ధం (ఫొటోలు)
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
రాజ్యాంగాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు.. ప్రధానిపై.. రాహుల్ ఆరోపణలు
KKR vs MI: కేకేఆర్తో ముంబై కీలక పోరు.. తుది జట్లు ఇవే
జూనియర్ ఎన్టీఆర్ను అణగదొక్కాలని చూస్తున్నారు: కొడాలి నాని
లోక్సభ ఎలక్షన్స్ 2024: మూడో దశ పోలింగ్ జరిగేది ఇక్కడే..
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement