'అమరావతి రైల్వేలైన్ కోసం త్వరలో సర్వే' | survey on on amaravati railway track, says ravindra gupta | Sakshi
Sakshi News home page

'అమరావతి రైల్వేలైన్ కోసం త్వరలో సర్వే'

May 13 2016 1:46 PM | Updated on May 25 2018 7:10 PM

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి రైల్వే లైన్ కోసం త్వరలో సర్వే ప్రక్రియ చేపట్టనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జీఎం రవీంద్రగుప్తా తెలిపారు.

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి రైల్వే లైన్ కోసం త్వరలో సర్వే ప్రక్రియ చేపట్టనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జీఎం రవీంద్రగుప్తా తెలిపారు. ఈ సర్వే ప్రక్రియ ఏడాదిలోపు పూర్తి చేస్తామని చెప్పారు. శుక్రవారం గుంటూరులో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... కృష్ణా పుష్కరాల నేపథ్యంలో రూ. 40 కోట్లతో వసతుల కల్పన చేపట్టనున్నట్లు వెల్లడించారు.

అలాగే 9 ప్రధాన రైల్వే స్టేషన్ల అభివృద్ధి చేస్తామన్నారు. పుష్కారాల కోసం 500 ప్రత్యేక రైళ్లు, 2000 కోచ్లు అందుబాటులో ఉంచాలని ప్రతిపాదన చేసినట్లు పేర్కొన్నారు. అంతకుముందు మంగళగిరిలోని శ్రీపానకాల లక్ష్మీనరసింహస్వామిని రవీంద్రగుప్తా దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement