వడదెబ్బతో యువకుడి మృతి | sunstrike kills youngster in kammam district | Sakshi
Sakshi News home page

వడదెబ్బతో యువకుడి మృతి

May 27 2016 7:31 AM | Updated on Apr 3 2019 8:07 PM

ఎండ తీవ్రత ధాటికి ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలం బద్దుతండా పంచాయతీకి చెందిన ఓ యువకుడు ప్రాణాలు విడిచాడు.

టేకులపల్లి(ఖమ్మం): ఎండ తీవ్రత ధాటికి ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలం బద్దుతండా పంచాయతీకి చెందిన ఓ యువకుడు ప్రాణాలు విడిచాడు. తుమ్మలచెలక గ్రామానికి చెందిన సూర్నపాక నరేందర్(25) గురువారం ఎండలో కూలి పనిచేశాడు. సాయంత్రానికి తీవ్ర అస్వస్థతకు గురైన అతడిని కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం ఉదయం చికిత్సపొందుతూ మృతిచెందాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement