ఎండ తీవ్రత ధాటికి ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలం బద్దుతండా పంచాయతీకి చెందిన ఓ యువకుడు ప్రాణాలు విడిచాడు.
టేకులపల్లి(ఖమ్మం): ఎండ తీవ్రత ధాటికి ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలం బద్దుతండా పంచాయతీకి చెందిన ఓ యువకుడు ప్రాణాలు విడిచాడు. తుమ్మలచెలక గ్రామానికి చెందిన సూర్నపాక నరేందర్(25) గురువారం ఎండలో కూలి పనిచేశాడు. సాయంత్రానికి తీవ్ర అస్వస్థతకు గురైన అతడిని కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం ఉదయం చికిత్సపొందుతూ మృతిచెందాడు.