మహిళా జెడ్పీటీసీ సభ్యులకు ప్రత్యేక గది | special room to women zptc members | Sakshi
Sakshi News home page

మహిళా జెడ్పీటీసీ సభ్యులకు ప్రత్యేక గది

Sep 19 2017 9:59 PM | Updated on Sep 20 2017 11:51 AM

వివిధ పనుల నిమిత్తం జిల్లా పరిషత్‌కు వచ్చే మహిళా జెడ్పీటీసీ సభ్యులు కూర్చుని సేద తీరేందుకు ప్రత్యేకంగా ఓ గదిని సిద్ధం చేస్తున్నారు.

అనంతపురం సిటీ: వివిధ పనుల నిమిత్తం జిల్లా పరిషత్‌కు వచ్చే మహిళా జెడ్పీటీసీ సభ్యులు కూర్చుని సేద తీరేందుకు ప్రత్యేకంగా ఓ గదిని సిద్ధం చేస్తున్నారు. ఇప్పటి వరకూ ఇలాంటి సదుపాయం లేకపోవడంతో మహిళా జెడ్పీటీసీ సభ్యులు స్వేచ్ఛగా కూర్చోడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. ఈ సమస్యను గుర్తించిన జెడ్పీ ఇన్‌చార్జి చైర్‌పర్సన్‌ శుభాషిణమ్మ, సీఈఓ శోభాస్వరూపారాణిలు  మహిళా సభ్యులు సేదతీరేందుకు ప్రత్యేకంగా ఓ గదిని పరిశీలించారు. డిప్యూటీ సీఈఓ ఛాంబర్‌కు పక్కనే ఉన్న గదిని ఎంపిక చేశారు. ఈ మేరకు కౌన్సిల్‌ సమావేశంలో తీర్మానం చేసి గదిలో చిన్నపాటి మరమ్మతులు చేయించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు వారు తెలిపారు. దీనిపై మహిళా జెడ్పీటీసీ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement