అక్రమంగా తరలిస్తున్న ఏడు క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు.
అక్రమంగా తరలిస్తున్న ఏడు క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. శుక్రవారం ఉదయం మామునూర్లో వాహన తనిఖీలు చేపట్టిన అధికారులు ఆటోలో తరలిస్తున్న బియ్యాన్ని పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరిపై కేసు నమోదు చేసి ఆటో సహా బియ్యాన్ని పోలీస్ స్టేషన్లో అప్పగించారు.