పుష్కరాలకు వెళ్లి వస్తూ..
ఆంధ్ర– తెలంగాణా సరిహద్దులోని దోమలపెంట సమీపంలో నల్లమల అటవీ ప్రాంతంలో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు.
వీరు బయలుదేరిన కొద్ది నిమిషాలకు ఎదురుగా వస్తున్న బస్సును ఢీ కొనడంతో డ్రైవర్ శివకుమార్ అక్కడిక్కడే మతి చెందాడు. గాయపడిన వారిని శ్రీశైలం ప్రాజెక్టు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గమధ్యంలో కేశవ చనిపోయాడు. తీవ్రంగా గాయపడ్డ సత్యనారాయణ, ఇస్మాయిల్ను హైదరాబాద్కు తరలించారు. ఈ ప్రమాదంలో రాజు స్వల్పంగా గాయపడ్డాడు. మన్ననూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


