అక్రమంగాతరలిస్తున్న 77క్వింటాళ్ల రేషన్బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
రేషన్ బియ్యాన్ని అక్రమంగా నల్లబజారుకు తరలిస్తున్నారనే సమాచారంతో దాడులు నిర్వహించిన విజిలెన్స్ అధికారులు 77 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం మల్లారం గ్రామంలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామం నుంచి 144 బస్తాల్లో రేషన్ బియ్యాన్ని తరలిస్తుండగా.. పోలీసుల సాయంతో దాడులు నిర్వహించిన విజిలెన్స్ అధికారులు బియ్యాన్ని స్వాధీనం చేసుకొని తరలిస్తున్న వ్యక్తిని పోలీసులకు అప్పగించారు.