'విశాఖ రైల్వేజోన్పై మార్గాలు అన్వేషిస్తున్నాం' | railway minister suresh prabhu comments on visakha railway zone | Sakshi
Sakshi News home page

'విశాఖ రైల్వేజోన్పై మార్గాలు అన్వేషిస్తున్నాం'

May 21 2016 3:59 PM | Updated on Sep 4 2017 12:37 AM

'విశాఖ రైల్వేజోన్పై మార్గాలు అన్వేషిస్తున్నాం'

'విశాఖ రైల్వేజోన్పై మార్గాలు అన్వేషిస్తున్నాం'

విశాఖ రైల్వేజోన్ ఏర్పాటుకు అన్ని మార్గాలు అన్వేషిస్తున్నామని రైల్వే మంత్రి సురేష్ ప్రభు అన్నారు.

ఢిల్లీ: విశాఖ రైల్వేజోన్ ఏర్పాటుకు అన్ని మార్గాలు అన్వేషిస్తున్నామని రైల్వే మంత్రి సురేష్ ప్రభు అన్నారు. శనివారం ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ...రైల్వేజోన్ అంశంపై నిపుణులతో సంప్రదింపులు కొనసాగుతున్నాయని చెప్పారు.

దక్షిణాది రాష్ట్రాలకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని సురేష్ ప్రభు పేర్కొన్నారు. గత ప్రభుత్వాల కంటే రాష్ట్రాలకు రెండింతలు బడ్జెట్ను పెంచామన్నారు. ప్రతి రోజుకు 7.8 కిలో మీటర్ల బ్రాడ్గేజ్ నిర్మాణం చేస్తున్నామని.. దీన్ని 19 కి.మీ వరకు పెంచడం తమ లక్ష్యమని ఆయన తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement