మహిమగల చెంబు అని.. రూ.15లక్షలు కాజేశారు | powerful jug row: police arrested 4 | Sakshi
Sakshi News home page

మహిమగల చెంబు అని.. రూ.15లక్షలు కాజేశారు

Mar 28 2016 5:43 PM | Updated on Sep 3 2017 8:44 PM

మహిమగలది అంటూ నిందితులు మహిళకు అంటగట్టిన చెంబు ఇదే.

మహిమగలది అంటూ నిందితులు మహిళకు అంటగట్టిన చెంబు ఇదే.

ఫొటోలో కనిపిస్తోందే.. అదొక మహిమగల చెంబట! దాన్ని ఇంట్లో పెట్టుకుంటే ఎక్కడెక్కడి సొమ్మంతా మన ఇంట్లోకి వచ్చి పడుతుందట!

ఎస్.కోట: ఫొటోలో కనిపిస్తోందే.. అదొక మహిమగల చెంబట! దాన్ని ఇంట్లో పెట్టుకుంటే ఎక్కడెక్కడి సొమ్మంతా మన ఇంట్లోకి వచ్చి పడుతుందట! 'ఎలా వస్తాయి? డబ్బులేమైనా సెల్ ఫోన్ సిగ్నల్సా.. గాలిలో వచ్చేయడానికి?' అని మీకు సందేహం రావచ్చు. కానీ అది నిజమని నమ్మి, ఆ మహిమగల చెంబును దక్కించుకునేందుకు లక్షలు ఇచ్చేస్తుంటారు కొందరు. చివరికి తాము మోసపోయామని తెలుసుకుని పోలీసులకు ఆశ్రయిస్తారు. విజయనగరం జిల్లా ఎస్.కోటలో సోమవారం వెలుగులోకి వచ్చిన సంఘటనా ఇలాంటిదే. పోలీసులు తెలిపిన వివరాలను బట్టి..

ఎస్.కోటకు చెందిన ఓ మహిళను సంప్రదించిన నిందితులు తమ దగ్గర మహిమగల చెంబు ఉన్నదని  నమ్మించి రూ. 15 లక్షలు కాజేసి ఉడాయించారు. తీరా ఆ చెంబు సాధారణ చెంబేనని తెలుసుకుని, మోసపోయానని గ్రహించిన ఆమె.. పోలీసులకు ఫిర్యాదుచేసింది. కేసు నమోదుచేసుకున్న పోలీసులు సోమవారం నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement