గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో ఆదివారం రోగులకు అల్పాహారంగా ఉప్మా పెట్టారు. అందులో ఓరోగికి పెట్టిన ఉప్మా ప్లేటులో పిన్నీస్ ప్రత్యక్షమైంది.
ఆదివారం లక్ష్మీనారాయణకు అల్పాహారం తీసుకొచ్చేందుకు తల్లి సామ్రాజ్యం అల్పాహారం పెట్టే బండి వద్దకు వెళ్ళి తీసుకొచ్చి కుమారుడికి ఇచ్చింది. రెండుముద్దలు తిన్న పిదప మూడో ముద్ద తినే సమయంలో నాలుకకు గుచ్చుకోవడంతో ఉప్మాను బయటకు ఊయడంతో పిన్నీస్ బయటపడింది. ఉప్మాను వడ్డించిన వారికి, నర్సింగ్ సిబ్బందికి విషయాన్ని తెలియజేసి తదుపరి ఆర్ఎంవో డాక్టర్ యనమల రమేష్కు బాధితుడు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశాడు. కాగా, ఈవిషయంపై ఆసుపత్రి డైటీషియన్ రవికుమార్, కాంట్రాక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ ఆహార పదార్థాలు తయారు చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకుంటామని, తమ వద్ద వండిన పదార్థాల్లో అలాంటివి ఉండవని పేర్కొన్నారు. కావాలనే కొందరు తమ పై బురదజల్లేందుకు ఈవిధంగాచేసి ఉండవచ్చని వెల్లడించారు.