'కేసీఆర్ పాలన ప్రజలకు నచ్చింది' | people with kcr: mp kavitha | Sakshi
Sakshi News home page

'కేసీఆర్ పాలన ప్రజలకు నచ్చింది'

Nov 24 2015 11:29 AM | Updated on Aug 15 2018 9:30 PM

'కేసీఆర్ పాలన ప్రజలకు నచ్చింది' - Sakshi

'కేసీఆర్ పాలన ప్రజలకు నచ్చింది'

వరంగల్ పార్లమెంటు స్ధానానికి జరిగిన ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీకి వచ్చిన భారీ మెజార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏడాదిన్నర పాలనకు నిదర్శనం టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు.

హైదరాబాద్‌: వరంగల్ పార్లమెంటు స్ధానానికి జరిగిన ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీకి వచ్చిన భారీ మెజార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏడాదిన్నర పాలనకు నిదర్శనం టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలతోపాటు ప్రజలకు ఆయనపై ఉన్న నమ్మకానికి ఈ ఉప ఎన్నిక ఫలితాలు రుజువు చేశాయని అన్నారు. కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ ఎందరో విమర్శలు చేశారని, హేమాహేమీలు వచ్చి కేసీఆర్ కు వ్యతిరేకంగా ప్రచారం చేసినా ప్రజలు మాత్రం టీఆర్ఎస్ నే నమ్మారని చెప్పారు. ప్రతిపక్షాలు బలహీనమయ్యాయని ఈ ఎన్నికలు మరోసారి రుజువు చేశాయని చెప్పారు.

గతంలో ఎలా ఉంది ఈ ఏడాదిన్నరో ఎలాంటి మార్పు వచ్చింది అనే విషయాన్ని ప్రజలు గమనించారని చెప్పారు. ముఖ్యమంత్రి చివరిసారిగా ఒకే సభ నిర్వహించారని, ఆ సభలో తాను ఇప్పటి వరకు చేసిన పని నచ్చితే ఓటు వేయండి లేదంటే శిక్షించండి అని నిర్ణయం ప్రజలకే వదిలేశారని చెప్పారు. మరోపక్క, భారీ మెజార్టీ అందించిన వరంగల్ ప్రజలకు ధన్యవాదములు అంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. తమను మరింత ఉత్సాహవంతంగా పనిచేసేందుకు వరంగల్ ప్రజలు స్ఫూర్తిని ఇచ్చారని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement