మెట్రో బస్సుల్లో వికలాంగులకు పాసులివ్వాలి | Sakshi
Sakshi News home page

మెట్రో బస్సుల్లో వికలాంగులకు పాసులివ్వాలి

Published Thu, Aug 11 2016 9:33 PM

మెట్రో బస్సుల్లో వికలాంగులకు పాసులివ్వాలి - Sakshi

సుందరయ్య విజ్ఞానకేంద్రం: హైటెక్, మెట్రో బస్సుల్లో వికలాంగులకు బస్‌ పాసులను అనమతించాలని కోరుతూ వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో గురువారం రవాణా శాఖ మంత్రి మహేందర్‌ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. బోర్డు సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చినట్టు వారు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో సమితి అధ్యక్షుడు గోరెంకల నర్సింహ, కార్యదర్శి ఎం. అడివయ్య, నాయకులు వెంకటేష్, వెంకట్, చంద్రమోహన్, నాగలక్ష్మి తదితరులు ఉన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement