తమ చిన్నారిని స్కూల్ నిర్వాహకులు కొట్టారని ఆరోపిస్తూ చిన్నారి తల్లిదండ్రులు స్కూల్ ఎదుట ఆందోళనకు దిగారు.
‘బచ్పన్’ ఎదుట ఆందోళన
Aug 20 2016 3:57 PM | Updated on Sep 4 2017 10:06 AM
హైదరాబాద్: తమ చిన్నారిని స్కూల్ నిర్వాహకులు కొట్టారని ఆరోపిస్తూ చిన్నారి తల్లిదండ్రులు స్కూల్ ఎదుట ఆందోళనకు దిగారు. నగరంలోని అల్వాల్ బచ్పన్ ప్లే స్కూల్లో నర్సరీ చదువుతున్న ఆరుషీ రెడ్డిని స్కూల్ లో దండించారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. బచ్పన్ యాజమాన్యం నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో వారు అల్వాల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
Advertisement
Advertisement