కుంటలో పడి వివాహిత మృతి | one women died | Sakshi
Sakshi News home page

కుంటలో పడి వివాహిత మృతి

Aug 24 2016 12:14 AM | Updated on Sep 4 2017 10:33 AM

మండలంలోని చింతలపల్లి గ్రామానికి చెందిన మతిస్థిమితం లేని ఓదెల లక్ష్మి(26) ప్రమాదవశాత్తు గ్రామ సమీపంలోని ఎల్లయ్యకుంటలో పడి మంగళవారం మృతిచెందింది.

మొగుళ్లపల్లి : మండలంలోని చింతలపల్లి గ్రామానికి చెందిన మతిస్థిమితం లేని ఓదెల లక్ష్మి(26) ప్రమాదవశాత్తు గ్రామ సమీపంలోని ఎల్లయ్యకుంటలో పడి మంగళవారం మృతిచెందింది. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం లక్ష్మి(26) కొంతకాలంగా మతిస్థిమితం కోల్పోయింది. ఈ క్రమంలో మంగళవారం బహిర్భూమి కోసమని కుంట వద్దకు వచ్చి అందులో పడి మృతిచెందింది. మృతురాలికి భర్త ఉన్నారు. మృతురాలి తల్లి రామక్క ఫిర్యాదుమేరకు కేసు దర్యాప్తు చేస్తునట్లు ఏఎస్సై సురేందర్‌ తెలిపారు.  

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement