కడుపునొప్పి తాళలేక మహిళ ఆత్మహత్యాయత్నం | one women attemt suicide due to stomach pain | Sakshi
Sakshi News home page

కడుపునొప్పి తాళలేక మహిళ ఆత్మహత్యాయత్నం

Aug 5 2016 11:37 PM | Updated on Oct 4 2018 4:40 PM

ఏలూరు అర్బన్‌ : దెందులూరు మండలం కొవ్వలి గ్రామానికి చెందిన ఓ మహిళ గుళికలు తిని ఆత్మహత్యకు యత్నించింది

ఏలూరు అర్బన్‌ : దెందులూరు మండలం కొవ్వలి గ్రామానికి చెందిన ఓ మహిళ గుళికలు తిని ఆత్మహత్యకు యత్నించింది. బాధితురాలి కథనం ప్రకారం.. కూటికుప్పల ఈశ్వరి చాలాకాలంగా కడుపునొప్పితో బాధపడుతోంది. ఈ నేపథ్యంలో బుధవారం తీవ్రమైన కడుపునొప్పి రావడంతో బాధను తాళలేక ఇంటిలో ఉన్న గుళికలు మింగి ఆత్మహత్యకు యత్నించింది. దీనిని గమనించిన అత్త సత్యవతి, భర్త నాగరాజు ఆమెను చికిత్స కోసం ఏలూరులోని ప్రై వేటు ఆసుపత్రిలో చేర్పించారు. అనంతరం రాత్రికి ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. 
  
 
 
 
 
  
 
 
 
 
  
 
 
 
 

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement