'ఆయన' కోసం రంగంలోకి దిగిన ఎన్నారై | NRI tries to save de satyanandam from call money case through lobbying | Sakshi
Sakshi News home page

'ఆయన' కోసం రంగంలోకి దిగిన ఎన్నారై

Dec 16 2015 10:28 AM | Updated on Jul 6 2019 12:42 PM

'ఆయన' కోసం రంగంలోకి దిగిన ఎన్నారై - Sakshi

'ఆయన' కోసం రంగంలోకి దిగిన ఎన్నారై

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'కాల్ మనీ' కేసులో దోషులను తప్పించేందుకు చాప కింద నీరులా పావులు కదులుతున్నాయి.

విజయవాడ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'కాల్ మనీ' కేసులో దోషులను తప్పించేందుకు పలువురు ప్రముఖులు రంగంలోకి దిగి చాప కింద నీరులా పావులు కదుపుతున్నారు. ఈ కేసులో కీలక వ్యక్తుల్లో ఒకరైన విద్యుత్ శాఖ డీఈ సత్యానందంను తప్పించేందుకు పెద్ద ఎత్తున లాబీయింగ్ మొదలైంది. సత్యానందాన్ని తప్పించేందుకు ఇప్పటికే ఓ ఎన్నారై ప్రముఖుడు రంగంలోకి దిగినట్లు సమాచారం. సదరు ఎన్నారై తానాలో కీలక పదవిలో ఉన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో కూడా ఆ ఎన్నారైకి మంచి సన్నిహిత సంబంధాలున్నాయని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో తెలుగు ఎన్నారైల వ్యవహారాలను చూస్తున్న టీడీపీ రాజ్యసభ ఎంపీ ద్వారా ఎన్నారై ఇప్పటికే లాబీయింగ్ ప్రారంభించారని తెలిసింది. గతంలో సత్యానందంకి కృష్ణా జిల్లా నందిగామ అసెంబ్లీ టికెట్ ఇప్పించేందుకు కూడా ఈ ఎన్నారై రంగంలోకి దిగారు. కానీ అది సాధ్యపడలేదని సమాచారం. కాల్ మనీ వ్యవహారంలో ఇప్పటికే సత్యానందంపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement