నిజాం షుగర్స్ దీక్షలో వందమంది.. | Nizam Sugar hundred in fast .. | Sakshi
Sakshi News home page

నిజాం షుగర్స్ దీక్షలో వందమంది..

Feb 26 2016 3:55 AM | Updated on Sep 3 2017 6:25 PM

నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్(ఎన్‌డీఎస్‌ఎల్)ను స్వాధీనం చేసుకుని ప్రభుత్వమే నడపాలన్న కార్మికుల నినాదాలతో దీక్షాశిబిరం దద్దరిల్లింది.

బోధన్: నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్(ఎన్‌డీఎస్‌ఎల్)ను స్వాధీనం చేసుకుని ప్రభుత్వమే నడపాలన్న కార్మికుల నినాదాలతో దీక్షాశిబిరం దద్దరిల్లింది. నిజాం షుగర్స్ రక్షణ కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా బోధన్‌లో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారం వందరోజులకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఎన్‌డీఎస్‌ఎల్ కార్మిక సంఘాల ప్రతినిధులు, కార్మికులు , ప్రజా సంఘాల ప్రతినిధులు, రైతులు మొత్తం వంద మంది దీక్షలో కూర్చున్నారు. దీక్షలకు మాజీ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, నిజాం షుగర్స్ రక్షణ కమిటీ కన్వీనర్ వి.రాఘవులు, బీఎంఎస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి రవిశంకర్ సంఘీభావం తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement