నిత్యకల్యాణ రాముడు | Sakshi
Sakshi News home page

నిత్యకల్యాణ రాముడు

Published Thu, Aug 11 2016 12:39 AM

రామయ్యకు నిత్యకల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు

భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారికి బుధవారం వైభవంగా నిత్యకల్యాణం జరిపారు. ఉదయం సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర కార్యక్రమాలు నిర్వహించారు. పవిత్ర గోదావరి నది నుంచి తీర్థ జలాలను తీసుకుని వచ్చి భద్రుని గుడిలో అభిషేకం చేశారు. స్వామివారి నిత్యకల్యాణ మూర్తులను ఆలయ ప్రాకార మండపంలో వేంచేయింపజేసి విశ్వక్సేనపూజ, పుణ్యహవచనం గావించారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ ధారణ, యోత్రధారణ చేశారు. వేదపండితులు విన్నపాలిచ్చారు. గోత్రనామాలను చదివి, తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.     – భద్రాచలం

 

Advertisement
Advertisement