18న నిజాం గ్రౌండ్స్లో ముదిరాజ్ల సభ | Sakshi
Sakshi News home page

18న నిజాం గ్రౌండ్స్లో ముదిరాజ్ల సభ

Published Mon, Nov 28 2016 3:23 AM

18న నిజాం గ్రౌండ్స్లో ముదిరాజ్ల సభ

సాక్షి, హైదరాబాద్: అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్న ముదిరాజ్ కులస్తులను బీసీ ‘డి’ గ్రూపు నుంచి ‘ఏ’ గ్రూపులోకి వెంటనే మార్చి ముదిరాజ్‌లను ఆదుకోవాలని తెలంగాణ ముదిరాజ్ మహాసభ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు పొల్కం లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. అపరిష్కృతంగా ఉన్న ముదిరాజ్ కులస్తుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ డిసెంబర్ 18న నిజాం కళాశాల గ్రౌండ్‌‌సలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆదివారం నారాయణగూడలోని ముదిరాజ్ మహాసభ కార్యాలయంలో బహిరంగ సభకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను మహాసభ ప్రధాన కార్యదర్శి పసుల విజయ్‌కుమార్, పి.వెంకటేశ్, కృష్ణంరాజు, నర్సింహులుతో కలసి ఆయన ఆవిష్కరించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement