- మంత్రి సునీతకు పీఏగా పని చేసిన టీచరు బదిలీ
- సిండికేట్నగర్ స్కూల్కు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
- విరుద్ధంగా కౌన్సెలింగ్ సమయంలో ఉత్తర్వులివ్వడంపై సర్వత్రా విమర్శలు
- కమిషనర్ ఉత్తర్వుల మేరకే స్కూల్ కేటాయించామంటున్న డీఈఓ
అనంతపురం ఎడ్యుకేషన్: ‘వడ్డించేవాడు మనోడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా కొదవండదనే’ నానుడికి అద్దంపట్టేలా ఉంది ప్రభుత్వ తీరు. నిబంధనలు సామాన్యులకు తప్ప తమలాంటి వారికి కాదని అధికార పార్టీ నేతలు నిరూపించారు. తాజాగా విద్యాశాఖలో బదిలీలు జరుగుతున్న తరుణంలో ప్రభుత్వం బదిలీ ఉత్తర్వులు జారీ చేయడం కలకలం రేపుతోంది. మంత్రి పరిటాల సునీత పీఏగా పని చేసిన బయాలజికల్ సైన్స్ టీచరు జగన్నాథంను అనంతపురం రూరల్ సిండికేట్నగర్కు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం ఉపాధ్యాయుల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధమని, చట్టాలు చేయాల్సిన వారే వాటిన అపహాస్యం చేసేలా నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ సామాన్య టీచర్లు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు మండిపడుతున్నారు. జగన్నాథం సోమందేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బయాలజికల్ సైన్స్ టీచరుగా పని చేస్తున్నారు. ఈయన మంత్రి పరిటాల కుటుంబానికి సమీప బంధువు. కొన్నేళ్లుగా సునీతకు అధికారికంగా పీఏగా పని చేస్తున్నారు. అయితే టీచర్లు బడిలోనే ఉండాలి తప్ప బోధనేతర పోస్టుల్లో ఉండకూడదంటూ ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ప్రజాప్రతినిధుల వద్ద పీఏలుగా ఉన్న టీచర్ల డెప్యుటేషన్లు రద్దు చేస్తూ వారిని బడికి పంపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా మంత్రి పరిటాల సునీత పీఏగా పని చేసిన జగన్నాథంను రిలీవ్ చేశారు. ఈ పరిస్థితుల్లో బడికి వెళ్లాల్సి వచ్చింది.
నిబంధనలకు విరుద్ధంగా ఉత్తర్వులు: నిబంధనల ప్రకారం బదిలీ షెడ్యూలు విడుదలయిన తర్వాత ఎలాంటి బదిలీలను ప్రభుత్వం చేపట్టకూడదు. అయితే జగన్నాథం విషయంలో ఇందుకు విరుద్ధంగా చర్యలు తీసుకుంది. ఆయన బదిలీ కోసం గతంలోనే దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై ప్రభుత్వం జిల్లా విద్యాశాఖ అధికారికి రిమార్క్సు అడిగింది. ఈలోపు బదిలీల షెడ్యూలు విడుదలైంది. ఇంతటితో ఈ ప్రక్రియ ముగిసిందని భావించారు. తీరా కౌన్సెలింగ్ రోజు బుధవారం సిండికేట్ నగర్ పాఠశాలకు జగన్నాథంను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా విద్యాశాఖ అధికారులు ఆగమేఘాలపైఅమలు చేశారు. వాస్తవానికి సిండికేట్నగర్ స్కూల్లో క్లియర్ వేకెన్సీ ఉంది. ఖాళీల జాబితాలో కూడా చూపించారు. తీరా కౌన్సెలింగ్ సమంయలో ఖాళీల జాబితాలో ఆ స్కూల్ పేరు గల్లంతుకావడంతో టీచర్లు అవాక్కయ్యారు. దీనిపై డీఈఓ లక్ష్మీనారాయణ ‘సాక్షి’తో మాట్లాడుతూ...జగన్నాథంను సిండికేట్నగర్ స్కూల్కు బదిలీ చేస్తూ కమిషనర్ ఉత్తర్వులిచ్చారని వాటిని అమలు చేశామన్నారు.
దటీజ్ జగన్నాథం!
Published Wed, Jul 26 2017 11:11 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్
తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో
ఓటీటీలో రాధిక నిర్మించిన వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
33 ఏళ్ల వయస్సులో అంతర్జాతీయ అరంగేట్రం.. ఎవరీ ఆశా శోభన?
అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
వడదెబ్బ నుంచి రక్షించే మహాభారత కాలం నాటి మజ్జిగ పానీయాలు ఇవే..!
Medigadda Barrage: గత సర్కారే కారణం!
మనసున్న ముఖ్యమంత్రి జగన్
ప్రచార వాహనాల అడ్డగింత
ఈవీఎంల కమిషనింగ్ కీలకం
తప్పక చదవండి
- కాంగ్రెస్, ఎస్పీ రామ ద్రోహ పార్టీలు: యోగి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- ప్రవీణ్తో బ్రేకప్.. తొలిసారి స్పందించిన ఫైమా
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- రూటే సెపరేటు
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement