పదిలో ప్రతిభకు పతకాలు | medals for merit student | Sakshi
Sakshi News home page

పదిలో ప్రతిభకు పతకాలు

May 28 2017 12:09 AM | Updated on Sep 5 2017 12:09 PM

పదో తరగతి పరీక్షల్లో పదికి పదిపాయింట్లు సాధించిన జిల్లా ట్రెజరీ కార్యాలయ ఉద్యోగుల పిల్లలకు ఆ శాఖ డీడీ శనివారం బంగారు పతకాలు బహూకరించారు.

కర్నూలు(అగ్రికల్చర్‌): పదో తరగతి పరీక్షల్లో పదికి పదిపాయింట్లు సాధించిన జిల్లా ట్రెజరీ కార్యాలయ ఉద్యోగుల పిల్లలకు ఆ శాఖ డీడీ శనివారం బంగారు పతకాలు బహూకరించారు. ఎం.హారిక, పి.గౌతమ్, షేక్‌ అక్షాతంజిలా, పి.రేఖప్రియ, కే.సాయితేజ, షేక్‌గౌషియాకు డీడీ గోల్డ్‌ మెడల్స్‌ను బహుకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఉన్నత లక్ష్యాన్ని కలిగి ఉండాలని, అపుడే ఏ రంగంలోనైనా రాణించేందుకు వీలవుతుందన్నారు. మంచి మార్కులు సాధించిన వారికి బహుమతులు ఇస్తే మరింత ప్రోత్సహించినట్లవుతుందన్నారు. కార్యక్రమంలో ఏడీ సుబ్రమణ్యం, ఏటీఓలు శ్రీనివాసులు, రవికుమార్, ఎస్‌టీఓలు రెడ్డి శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement