ఔను.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు..! | love marriage in pathapatnam | Sakshi
Sakshi News home page

ఔను.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు..!

Oct 31 2015 10:48 AM | Updated on Sep 3 2017 11:47 AM

ఔను.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు..!

ఔను.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు..!

పాతపట్నం మేజర్ పంచాయతీకి చెందిన వికలాంగులు మజ్జి చంద్రరావు, డోల శాంతిలు పెద్దలు సాక్షిగా శుక్రవారం ఒక్కటయ్యారు.

పాతపట్నం : పాతపట్నం మేజర్ పంచాయతీకి చెందిన వికలాంగులు మజ్జి చంద్రరావు, డోల శాంతిలు పెద్దలు సాక్షిగా శుక్రవారం ఒక్కటయ్యారు. కోటగుడి కాలనీకి చెందిన మజ్జి చంద్రరావు పుట్టుక తోనే అంధుడు. శివశంకర్ కాలనీ ఐదోలైన్‌లో ఉంటున్న డోల శాంతి పొట్టిమనిషి. వీరద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు.

దీంతో గ్రామానికి చెందిన పెద్దలు కొంచాడ వీరభద్రరావు, శాసనపూరి మహేశ్వరావు, సవిరిగాన ప్రదీప్, జె.సోమేశ్వరావు, తిడ్డిమి శ్రీనువాసరావు, మిశ్రో తదితరులు స్థానిక వేంకటేశ్వర ఆలయంలో వీరి పెళ్లి జరిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement