కోర్టు విధులను బహిష్కరించిన న్యాయవాదులు | Lawyers boycotted functions | Sakshi
Sakshi News home page

కోర్టు విధులను బహిష్కరించిన న్యాయవాదులు

Aug 6 2016 12:38 AM | Updated on Sep 4 2017 7:59 AM

కోర్టు విధులను బహిష్కరించిన న్యాయవాదులు

కోర్టు విధులను బహిష్కరించిన న్యాయవాదులు

: హైకోర్టును వెంటనే విభజించాలని, సీమాంధ్ర న్యాయమూర్తులను వారి స్వస్థలాలకు పంపాలని కోరుతూ ఆందోళన చేస్తున్న న్యాయవాదులకు కోర్టు దిక్కార నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ శుక్రవారం కోదాడ జూనియర్‌ సివిల్‌కోర్టు న్యాయవాదులు తమ విధులను బహిష్కరించి కోర్టు ఎదుట ధర్నా నిర్వహించారు.

కోదాడ: హైకోర్టును వెంటనే విభజించాలని, సీమాంధ్ర న్యాయమూర్తులను వారి స్వస్థలాలకు పంపాలని కోరుతూ ఆందోళన చేస్తున్న న్యాయవాదులకు కోర్టు దిక్కార నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ శుక్రవారం కోదాడ జూనియర్‌  సివిల్‌కోర్టు న్యాయవాదులు తమ విధులను బహిష్కరించి కోర్టు ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కోదాడ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఈదుల కష్ణయ్య మాట్లాడుతూ వెంటనే కోర్టు ధిక్కార నోటీసులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. న్యాయవాదులు ప్రజాస్వామ్య బద్దంగానే తమ నిరసన వ్యక్తం చేస్తే దానికి నోటీసులు జారీ చెయడం అన్యాయమన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు ముల్కా వెంకటరెడ్డి, గాలి శ్రీనివాసనాయుడు, రంజాన్‌పాష, ఎల్‌. ధనమూర్తి, చింతకుంట్ల రామిరెడ్డి, కేఎల్‌ఎన్‌ ప్రసాద్, మందా వెంకటేశ్వర్లు, పగడాల రాంమచంద్రారెడ్డి, ఎలుక సుధాకర్‌రెడ్డి, రంగారావు, విజయ్‌కుమార్, యశ్వంత్‌ రామారావు, గట్ల నర్సింహారావు, ఉయ్యాల నరసయ్య తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement