కందకంలోకి బోల్తా కొట్టిన కారు | kid injured | Sakshi
Sakshi News home page

కందకంలోకి బోల్తా కొట్టిన కారు

Jul 17 2016 10:53 PM | Updated on Aug 14 2018 3:22 PM

కందకంలోకి బోల్తా కొట్టిన కారు - Sakshi

కందకంలోకి బోల్తా కొట్టిన కారు

రు కందకంలో బోల్తా పడి చిన్నారికి గాయాలు కాగా భార్యాభర్తలు ప్రమాదం నుంచి బయట పడిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది.

కంచికచర్ల :
కారు కందకంలో బోల్తా పడి చిన్నారికి గాయాలు కాగా భార్యాభర్తలు ప్రమాదం నుంచి బయట పడిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. వివరాలు.. జాతీయ రహదారిపై విజయవాడ వైపు నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న కారు మండలంలోని కీసర సమీపంలోకి రాగానే అదుపు తప్పి కందకంలోకి దూసుకెళ్లింది. కారులో హైదరాబాద్‌కు చెందిన ఓబుల్‌రెడ్డి అతని భార్య కనకలక్ష్మి, ఐదునెలల కూతురు ఉన్నారు. ప్రమాద సమాయంలో కారులో ఉన్న ఎయిర్‌బెలూన్లు తెరుచుకోవటం వలన పెద్ద ప్రమాదం తప్పింది. ఆ సమయంలో కారులో ఉన్న చిన్నారి హార్ధియా కారు నుంచి కందకంలో పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. భార్యాభర్తలకు స్వల్ప గాయాలయ్యాయి. బాధితులను విజయవాడ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఎస్‌ఐ కె.ఈశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement