పుష్కరపనులు పరిశీలించిన జేసీ | JC observed pushkar works | Sakshi
Sakshi News home page

పుష్కరపనులు పరిశీలించిన జేసీ

Aug 7 2016 11:46 PM | Updated on Sep 4 2017 8:17 AM

పుష్కరపనులు పరిశీలించిన జేసీ

పుష్కరపనులు పరిశీలించిన జేసీ

మండలంలో కృష్ణాపుష్కరాల సందర్భంగా ఏర్పాటు చేసిన బగ్గుమాధవరం,వజినేపల్లి ,కిష్టాపురం గ్రామాల వద్ద ఏర్పాటు చేసిన స్నానపు ఘాట్లను జాయింట్‌ కలెక్టర్‌ సత్యనారాయణ ఆదివారం పరిశీలించారు.

బుగ్గమాధవరం(మేళ్లచెర్వు)
మండలంలో కృష్ణాపుష్కరాల సందర్భంగా ఏర్పాటు చేసిన బగ్గుమాధవరం,వజినేపల్లి ,కిష్టాపురం గ్రామాల వద్ద ఏర్పాటు చేసిన స్నానపు ఘాట్లను జాయింట్‌ కలెక్టర్‌ సత్యనారాయణ ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా పుష్కర ఘాట్ల నిర్మాణ పనులు, అక్కడ ఏర్పాటు చేసిన మౌలిక సదు పాయాలను పరిశీలించారు. ఇంకా మిగిలి ఉన్న పనులను నేటితో పూర్తి చేయాలన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో ఏర్పాటు చేసిన 28 ఘాట్ల పరిధిలో 1400 మంది ప్రభుత్వ అధికారులు, 8000 మంది ప్రైవేట్‌ ఉద్యోగులను నియమించినట్లు తెలిపారు. వారికి 9,10 తేదీల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆయన వెంట డ్వామా పీడీ దామోదర్‌రెడ్డి,ఆర్‌డీఓ నారాయణరెడ్డి,తహసీల్దార్‌ శ్రీదేవి,ఐబీ డీఈ స్వామి, ఎంపీడీఓ శాంతకుమారి పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement