శ్రీవారిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి | high court judge in tirumala | Sakshi
Sakshi News home page

శ్రీవారిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి

Sep 24 2016 11:43 PM | Updated on Sep 4 2017 2:48 PM

ఆలయం వద్ద హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌ తదితరులు

ఆలయం వద్ద హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌ తదితరులు

ఏపీ, తెలంగాణా ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌ శనివారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.

 
సాక్షి, తిరుమల: ఏపీ, తెలంగాణా ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌ శనివారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయం అనంతరం ఆయన ఆలయానికి వచ్చారు. ముందుగా  ధ్వజస్తంభానికి మొక్కుకున్నారు. తర్వాత శ్రీవారిని, వకుళమాతను దర్శించుకుని హుండీలో కానుకలు సమర్పించారు.  ఈసందర్భంగా రంగనాయక మండపంలో అధికారులు లడ్డూ ప్రసాదాలు అందజేశారు. ఆయన వెంట టీటీడీ లా ఆఫీసర్‌ వెంకటరమణ,  జిల్లా జడ్జి  దుర్గాప్రసాద్‌ , ప్రోటోకాల్‌ జడ్జి శేషాద్రి ఉన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement