ముంపు ప్రాంతాల్లో జెన్‌కో అధికారుల పర్యటన | genco officers visits plain areas in nalgonda district | Sakshi
Sakshi News home page

ముంపు ప్రాంతాల్లో జెన్‌కో అధికారుల పర్యటన

May 13 2016 5:36 PM | Updated on Aug 29 2018 4:18 PM

నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలోని నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్ ప్రాంతాన్ని జెన్‌కో అధికారులు పరిశీలించారు.

దామరచర్ల: నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలోని నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్ ప్రాంతాన్ని జెన్‌కో అధికారులు పరిశీలించారు. ఇప్పటికే మండలంలోని ముంపు గ్రామాలకు పరిహారం అందింది. అయితే, తమకు నష్టం జరుగుతున్నా పరిహారం ఇవ్వలేదంటూ చిట్యాల గ్రామ ప్రజలు పలుమార్లు ఆందోళనకు దిగటంతో అధికారులు స్పందించారు. శుక్రవారం ఆ గ్రామాన్ని పరిశీలించి, వివరాలు తెలుసుకున్నారు. వారికి స్థానిక ప్రజాప్రతినిధులు వినతి పత్రాలు సమర్పించారు.

Advertisement
 
Advertisement
Advertisement