రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో అల్లాడిపోతున్న ప్రజలు.. ఏదో ఒక రూపంలో వేసవి తాపాన్ని తీర్చుకుంటున్నారు. ఇక పల్లె సీమల్లో పరిస్థితే వేరు. ఇటీవల హంద్రీ-నీవా నీటితో చెరువులను నింపడంతో అందులో యువకులు, విద్యార్థులు ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఈత కొడుతున్నారు. రామగిరి మండలం పోలేపల్లి చెరువులో ఆదివారం సరదాగా ఈత కొడుతున్న యువకులు.. వారిలో వారే పోటీలు వేసుకుని కేరింతలు కొట్టారు.
- రామగిరి
# Tag
Related news
-
ఏప్రిల్లోనే ఎండిపోయిన నది.. 25 వేల జనాభా విలవిల!
దేశంలోని పలు రాష్ట్రాల్లో వేసవి విజృంభిస్తోంది. ఛత్తీస్గఢ్లోని రామానుజ్గంజ్ ప్రాంతంలోని 25 వేల జనాభాకు నీటిని అందించే కన్హర్ నది ఏప్రిల్లోనే ఎండిపోయింది. దీంతో నదిలో ఒక పెద్ద గొయ్యి తవ్వి అక్కడి జనాభాకు నగర పంచాయతీ నీటిని అందిస్తోంది. రామానుజ్గంజ్ ప్రాంతానికి సరిపడా తాగునీటిని అందించేందుకు జలవనరుల శాఖ కోట్లాది రూపాయలతో నదిపై ఆనకట్టను నిర్మించేందుకు సన్నాహాలు చేసింది. అయితే అధికారుల అవినీతి కారణంగా నిర్మాణ పనులు నిలిచిపోయాయి.ఎంతకాలం ఎదురు చూసినా ఆనకట్ట నిర్మాణానికి నోచుకోకపోవడంతో రామానుజ్గంజ్వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పురాతన ఆనకట్టను తొలగించి, నూతన నిర్మాణం చేపడితేనే నగరానికి సరిపడా నీరు అందుతుందని స్థానికులు అంటున్నారు.ఈ నది ఎండిపోవడంతో స్థానికులతో పాటు ఈ నదిపై ఆధారపడిన జంతువులు, పక్షులు సైతం విలవిలలాడిపోతున్నాయి. దీనిని గుర్తించిన జిల్లా యంత్రాంగం, నగరపంచాయతీ స్థానికులకు తాగు నీటిని అందించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. -
వేసవి సెలవుల్లో ప్రత్యేక రైళ్లు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): వేసవి సెలవుల్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సౌత్ సెంట్రల్ రైల్వే ప్రత్యేక వారాంతపు రైళ్లను నడపనున్నట్లు విజయవాడ డివిజన్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ మండ్రూప్కర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రత్యేక రైలు (ట్రైన్ నంబర్ 07234) ఈ నెల 28నుంచి జూన్ 30వ తేదీ వరకు ప్రతి ఆదివారం సికింద్రాబాద్ నుంచి సంత్రగచి వరకు నడుస్తుందని పేర్కొన్నారు. సికింద్రాబాద్లో రాత్రి 11.40 బయలుదేరి నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, యలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్డు, పలాస, బరంపూర్, కుర్దారోడ్డు, భువనేశ్వర్, కటక్, బద్రాక్, ఖరగ్పూర్ మీదుగా మంగళవారం ఉదయం 5 గంటలకు సంత్రగచి చేరుతుందన్నారు. ఈ ట్రైన్ (నంబర్ 07235) తిరిగి ఈనెల 30వ తేదీ నుంచి జూలై 2 వరకు మంగళవారాల్లో సంత్రగచిలో మధ్యాహ్నం 12.20కి బయలుదేరి బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది. విజయవాడకు బుధవారం ఉదయం 8.45కు వస్తుంది. 18 బోగీలతో నడిచే ఈ రైళ్లలో ఎటువంటి రిజర్వేషన్ సౌకర్యం ఉండదన్నారు. స్టేషన్లలో బుకింగ్ కౌంటర్ల వద్ద టికెట్లు పొందవచ్చునని తెలిపారు. యూటీఎస్ మొబైల్ యాప్ ద్వారా ఆన్లైన్ టికెట్లు తీసుకోవచ్చని తెలిపారు. -
సమ్మర్లో పిల్లలకు ఇలా చేసి పెడితే, ఇష్టంగా తింటారు, బలం కూడా!
వేసవి అంటే పిల్లలకు ఆటవిడుపు కాలం. పరీక్షలు పూర్తయ్యిన తరువాత ఆనందంగా ఆడుకునే కాలం. ఎండా, కొండా లెక్క చేయకుండా హాయిగా తోటి స్నేహితులతో కలిసి చెంగు చెంగున గెంతులేస్తూ ఉత్సాహంగా గడిపే కాలం. మరి ఇలాంటి సమయంలో వారికి మంచి పోషకాహారాన్ని ఇవ్వాలి. ముఖ్యంగా ప్యాకేజ్డ్ ఫుడ్, జంక్ఫుడ్కు దూరంగా ఉంటూ.. ఇంట్లోనే రుచికరంగా తయారు చేసి పెట్టాలి. తాజా ఆకుకూరల్ని, కూరగాయల్ని, పండ్లను డైట్లో ఉంచాలి. మంచి పోషకాహారమే వారికి అసలైన దివ్యౌషధం. మొలకలొచ్చిన గింజ ధాన్యాలు శనగలు, పెసలతోపాటు మొలకలు వచ్చిన గింజలతో క్యారట్ లాంటి కూరగాయ ముక్కల్ని కలిపి సలాడ్లా పెడితే కాల్షియం, ఇతర ప్రొటీన్లు లభిస్తాయి. దీంతో వారి ఎముకలు, కండరాలు దృఢంగా పెరుగుతాయి. ఎదుగుదల అద్భుతంగా ఉంటుంది. ఉడికించిన శనగలు ఉడికించిన శనగలు రెగ్యులర్గా తీసుకుంటే రక్త హీనతకు చెక్ చెప్పవచ్చు. ఇందులోని ఐరన్ కంటెంట్ శరీరానికి అంది రక్త వృద్ధి జరుగుతుంది.రోగ నిరోధక శక్తి రెట్టింపు అవుతుంది. మెదడు చురుగ్గా, వేగంగా పని చేస్తుంది.అలసట, నీరసం వంటి సమస్యలుండవు. పిస్తా, బాదం, జీడిపప్పుతో పాటు పల్లీలు, కుసుమలు. లాంటి గింజలను ఆహారంలో చేరిస్తే చిన్నారుల ఇమ్యూనిటీ పెరుగుతుంది. బల వర్ధకంగా ఉంటుంది. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినిపించటం వల్ల పిల్లల మెదడు చురుకుగా పని చేస్తుంది. ప్రతిరోజూ కాల్షియం కోసం పాలు, పౌష్టికాహారం కోసం కోడిగుడ్లు లాంటివి సరైన సమయంలో వారికందేలా చేస్తే తొందరగా వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది. బలవర్ధకమైన సలాడ్ ఉడికించిన శనగలు, ఉడికించిన బొబ్బర్లు, ఉడికించిన పెసలు, ఉల్లిపాయ, టమాటా ముక్కలు, యోగర్ట్, కొద్దిగా కొత్తిమీర, తయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. ముందుగానేఉడికించి పెట్టుకున్నగింజలు, ఉల్లిపాయ, టమాటా ముక్కలు వేసి బాగాకలపాలి. దీనికి తాజా యోగర్ట్, కొద్దిగా ఉప్పు, మిరియాలు వేసి కలపాలి. దీనిపైన సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తమీద చల్లి, చల్లచల్లగా అందిస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. పిల్లల ఇష్టాఇష్టాలను బట్టి, ఇందులో కొబ్బరి, వేయించిన పల్లీలు, స్వీట్కార్న్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది బలవర్ధక ఆహారం కూడా. -
నిప్పుల కొలిమి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. ఎండలు భగ్గుమంటున్నాయి. సాధారణం కంటే 5 డిగ్రీల మేర అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీనికితోడు తీవ్ర ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కూలర్లు, ఫ్యాన్లు ఏమాత్రం ఉపశమనం ఇవ్వక తిప్పలు పడుతున్నారు. శుక్రవారం నల్లగొండ జిల్లా బుగ్గబావిగూడలో 45 డిగ్రీలు, మాడుగులపల్లిలో 44.8 డిగ్రీల సెల్సియస్ చొప్పు న గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వాతావరణంలో నెలకొంటున్న మార్పులతో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. శుక్రవారం ఖమ్మంలో సాధారణం కంటే 5.2 డిగ్రీలు అధికంగా గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. భద్రాచలం, నల్లగొండలలో 4 డిగ్రీలు, ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్లలో 3 డిగ్రీల మేర అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగతా ప్రాంతాల్లో 2 డిగ్రీల మేర అధికంగా ఉన్నాయి. మరో మూడు రోజులు ఇలానే.. రాష్ట్రంలో మరో మూడు రోజులు సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని.. ఇదే తరహా పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది. అత్యవసర పనులుంటే తప్ప మధ్యా హ్నం పూట బయటికి రావొద్దని అధికారులు హెచ్చరించారు. ఇక ప్రస్తుతం మరాఠ్వాడ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. దాని ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన మోస్తరు వానలు పడవచ్చని తెలిపారు. శనివారం ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. తీవ్ర ఎండలతో జాగ్రత్త అధిక ఉష్ణోగ్రతలు,వడగాడ్పుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రజారో గ్య విభాగం సూచించింది. ఈ మేరకు శుక్రవార ం ప్రకటన జారీ చేసింది. వాతావరణ శాఖ కూ డా హీట్ వేవ్ అలర్ట్ జారీ చేసింది. అవేమంటే.. ► దాహం వేయకపోయినా కూడా అవసరమైన మేర నీళ్లు తాగుతూ ఉండాలి. ఓఆర్ఎస్, నిమ్మరసం, లస్సీ, మజ్జిగ, పండ్ల రసాలు వంటివి తాగాలి. ► వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలి. మధ్యాహ్న సమయంలో బయటికి వెళ్లకపోవడం మంచిది. బాగా గాలి వచ్చే, చల్లని ప్రదేశాలలో ఉండాలి. ► ఎండకు వెళ్లాల్సి వస్తే.. సన్నని వదులుగా ఉండే కాటన్ వ్రస్తాలను ధరించాలి. తలపై టోపీ, గొడుగు వంటివి కప్పుకోవాలి. ► మధ్యాహ్న సమయంలో ఆరు బయట తీవ్ర శారీరక శ్రమ చేయవద్దు. ► ఎవరైనా వడదెబ్బకు లోనైట్టు గుర్తిస్తే.. వెంటనే వైద్య సహాయం అందించాలి. -
క్రికెట్లో కృత్రిమ మేధ.. ఐస్ కూల్గా ఐపీఎల్ (ఫోటోలు)
Related News by category
-
నిత్యం అప్రమత్తంగా ఉండాలి
అనంతపురం: నిత్యం అప్రమత్తంగా ఉంటూ ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని అనంతపురం రేంజ్ డీఐజీ ఆర్ఎన్ అమ్మిరెడ్డి అన్నారు. జిల్లా సరిహద్దులో ఉన్న విడపనకల్లు, ఓబుళాపురం అంతరాష్ట్ర చెక్ పోస్టులను డీఐజీ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. చెక్పోస్టుల వద్ద నిర్వహించిన వాహనాల తనిఖీలలో డీఐజీ స్వయంగా పాల్గొన్నారు. రిజిస్టర్లను పరిశీలించారు. కర్ణాటక నుంచి వచ్చే బస్సులు, లగేజీ వాహనాలు, కార్లు, ద్విచక్ర వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. రాత్రి వేళ పకడ్బందీగా తనిఖీలు చేపట్టాలన్నారు. నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఊపందుకోవడంతో కలెక్టరేట్తో పాటు అనంతపురం, గుంతకల్లు, కళ్యాణదుర్గం ఆర్డీఓ కార్యాలయాలు, రాయదుర్గం, ఉరవకొండ, రాప్తాడు, శింగనమల, తాడిపత్రి తహసీల్దార్ కార్యాలయాల వద్ద ఎస్పీ అమిత్ బర్దర్ ఆదేశాల మేరకు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. బందోబస్తును స్వయంగా ఏఎస్పీలు, డీఎస్పీలు, సీఐ పర్యవేక్షించేలా ఆదేశాలు జారీ చేశారు. -
బాలికలు.. భళా
● పదో తరగతిలో గతేడాదికంటే మెరుగైన ఫలితాలు ● బాలికలు 85.01, బాలురు 77.08 శాతం ఉత్తీర్ణత ● 598 మార్కులతో జిల్లా టాపర్గా నిలిచిన విద్యార్థిని తన్నేరు ప్రణతి ● 76 స్కూళ్లలో వందశాతం ఉత్తీర్ణత అనంతపురం ఎడ్యుకేషన్: పదో తరగతి పరీక్ష ఫలితాల్లో బాలికలు భళా అనిపించారు. సోమవారం విద్యాశాఖ కమిషనర్ సురేష్కుమార్ ఫలితాలు విడుదల చేశారు. మొత్తం 30,893 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 25,0003 మంది ఉత్తీర్ణత (80.93) శాతం సాధించారు. వీరిలో 15,017 మంది బాలికలను గాను 12,766 మంది 85.01 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలురు 15,876 మందికి గాను 12,237 మంది 77.08 శాతం ఉత్తీర్ణత సాధించారు. జిల్లాలో గతేడది 16 స్కూళ్లు వందశాతం ఉత్తీర్ణత సాధించగా ఈసారి ఏకంగా 76 స్కూళ్లు ఈ వందశాతం ఫలితాలు సాధించడం విశేషం. ఉత్తీర్ణులైన వారిలో 18,432 మంది ప్రథమశ్రేణి, 4,100 మంది ద్వితీయ శ్రేణి, 2,471 మంది తృతీయ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. టాప్లో బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లు బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూళ్లు టాప్లో నిలిచాయి. 273 మంది విద్యార్థులకు గాను 269 మంది 98.3 శాతం ఉత్తీర్ణత సాధించారు. సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలల్లో 660 మందికి గాను 638 మంది 96.67 శాతం, ప్రైవేట్ స్కూళ్లలో 11,175 మందికి గాను 10,719 మంది 95.92 శాతం ఉత్తీర్ణత సాధించారు. మైనార్టీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూళ్లలో 237 మందికి గాను 226 మంది 95.36 శాతం, ఏపీ మోడల్ స్కూళ్లల్లో 1,137 మందికి గాను 1027 మంది 90.33 శాతం, కేజీబీవీల్లో 1,252 మందికి గాను 1,053 మంది 84.11 శాతం, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూళ్లలో 190 మందికి గాను 145 మంది 76.32 శాతం, ఎయిడెడ్ స్కూళ్లల్లో 426 మందికి గాను 324 మంది 76.06 శాతం, మునిసిపల్ స్కూళ్లల్లో 2,155 మందికి గాను 1,522 మంది 70.63 శాతం, జిల్లా పరిషత్ స్కూళ్లల్లో 11,453 మందకి గాను 7,800 మంది 68.10 శాతం, ప్రభుత్వ స్కూళ్లల్లో 1,935 మందికి గాను1,280 మంది 66.15 శాతం ఉత్తీర్ణత సాధించారు. 24వ స్థానంలో జిల్లా జిల్లాలో గతేడాదికంటే మెరుగైన ఫలితాలు వచ్చినా రాష్ట్రంలో నాలుగుస్థానాలకు కిందకు పడిపోయిది. గతేడాది 66.25 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో మన జిల్లా 20వ స్థానంలో నిలవగా ఈసారి 80.93 శాతం అంటే 14.68 శాతం పెరిగింది. 24వ స్థానాన్ని సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 30లోగా ఫీజు చెల్లింపు ఫెయిల్ అయిన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి ఈనెల 30లోగా ఫీజు చెల్లించాలని డీఈఓ వరలక్ష్మి తెలిపారు. మూడుకంటే ఎక్కువ సబ్జెక్టుల పైన రూ. 125, మూడు లోపు సబ్జెక్టులకు రూ. 110, ఒకేషనల్ విద్యార్థులు రెగ్యులర్ ఫీజుతో పాటు అదనంగా రూ. 60 చెల్లించాలని సూచించారు. రీకౌంటింగ్కు రూ. 500, రీ వెరిఫికేషన్ ద్వారా జవాబుపత్రం నకలు కావాల్సిన వారు రూ. 1000 ఈనెల 30లోగా సంబంధిత పాఠశాల హెచ్ఎం లాగిన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేశారు. -
పదిలో ప్రభుత్వ వసతి గృహాల విద్యార్థుల ప్రతిభ
అనంతపురం రూరల్: ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ వసతి గృహాల విద్యార్థులు పదో తరగతి పరీక్షల్లో అద్భుత ఫలితాలు సాధించారు. వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులకు ప్రభుత్వం మౌలిక వసతులు మెరుగు పరచడంతో పాటు పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. జిల్లాలోని 79 ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాల్లో 1,172 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయగా వీరిలో 964 మంది ఉత్తీర్ణత సాదించారు. 37 బీసీ వసతి గృహాల్లో 560 మందికి గాను 448 మంది ఉత్తీర్ణత సాధించడం గమనార్హం. వీరిలో 22 మంది 500కు పైగా మార్కులు సాధించారు. 33 సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లోని 360 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 321 మంది ఉత్తీర్ణత సాదించారు. వీరిలో 11 మంది 500కు పైగా మార్కులు సాధించారు. 3 ఎస్టీ వసతి గృహాలు, 6 గురుకుల పాఠశాలల్లోని 252 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, వీరిలో 195 మంది ఉత్తీర్ణత సాధించి సత్తా చాటారు. అత్యధికంగా గుత్తి ఎస్సీ బాలుర వసతి గృహం–1 విద్యార్థి డి.ఆసీఫ్ 570 మార్కులు, రాయదుర్గంలోని బీసీ (బాలికల) హాస్టల్ విద్యార్థిని అభిల 560 మార్కులు, గొల్లలదొడ్డిలోని గిరిజన సంక్షేమశాఖ హాస్టల్ విద్యార్థి గురుచరణ్ నాయక్ 533 మార్కులు సాధించారు. -
విజయం మాదే: ఎమ్మెల్యే అనంత
ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 99 శాతం అమలు చేశారని ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు.ర్యాలీలో భాగంగా గీతామందిరం సమీపంలో ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అనంతపురం నియోజకవర్గంలో రూ.1,045 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టడమే కాకుండా ప్రజలకు రూ.2 వేల కోట్ల సంక్షేమ ఫలాలు అందించామన్నారు. ఈ ఎన్నికల్లోనూ విజయం తమదేనని, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా అనంతపురం నియోజకవర్గంలో మరింత అభివృద్ధి చేసి చూపుతామని స్పష్టం చేశారు. గతంలో వైఎస్సార్ సీపీకి వచ్చిన సీట్ల కంటే ఈసారి ఎక్కువగా పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అవినీతిలో కూరుకుపోవడమే కాకుండా ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. పోలవరం ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకున్నారని టీడీపీ అధినేత చంద్రబాబుపై అప్పట్లో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. -
మండుటెండలోనూ పోటెత్తారు..
ఉరవకొండ: పట్టణంలో సోమవారం వైఎస్సార్ సీపీ అభ్యర్థి విశ్వేశ్వర రెడ్డి నామినేషన్ కార్యక్రమం ఘనంగా జరిగింది. వైఎస్సార్ సీపీ నాయకులు, వైఎస్సార్ అభిమానులు పోటెత్తారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా గ్రామాల నుంచి తరలివచ్చి విశ్వకు మద్దతు తెలిపారు. మహిళలు సైతం వేలాదిగా తరలివచ్చి సంఘీభావం ప్రకటించారు. డీజేలు, డ్రమ్స్, వాయిద్యాలు, తప్పెట్లు, బాణాసంచా పేలుళ్ల మధ్య డ్యాన్సులు చేస్తూ కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ముందుగా కూడేరు సంగమేశ్వరస్వామి ఆలయం, పెన్నహోబిలం లక్ష్మీనృసింహస్వామి ఆలయాల్లో తమ కుటుంబ సభ్యులతో కలిసి విశ్వ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉరవకొండ తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ పత్రాలను తన కుమారుడు, పార్టీ యువనేత ప్రణయ్రెడ్డి, నాయకులు ఏసీ ఎర్రిస్వామి, మూలగిరిపల్లి ఓబన్న, ఎంసీ నాగభూషణంతో కలిసి ఆర్ఓ కేతన్గార్గ్కు అందించారు. ఉరవకొండ, విడపనకల్లు, కూడేరు, వజ్రకరూరు, బెళుగుప్ప మండలాల నుంచి తరలివచ్చిన పార్టీ శ్రేణులు, అభిమానులతో కలిసి ర్యాలీ చేపట్టారు. దారి పొడవునా ఉప్పొంగిన ఉత్సాహంతో వేచి చూస్తున్న ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. కవితాహోటల్ సర్కిల్ వద్ద నిర్వహించిన బహిరంగసభలో మాట్లాడారు. ఐదేళ్ల వైఎస్సార్ సీపీ ప్రభుత్వ పాలనలో ఉరవకొండ నియోజకవర్గంలో కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి జరిగిందని, నిండు మనసుతో తనను ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ నదీంఅహ్మద్, యాదవ, రజక కార్పొరేషన్ల చైర్మన్లు హరీష్యాదవ్, మీసాల రంగన్న, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు వీరన్న, ఆర్టీసీ రీజి నల్ చైర్పర్సన్ మాల్యవంతం మంజుల, ఐదు మండలాల జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మార్కెట్ యార్డు చైర్మన్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఉరవకొండ వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా ‘విశ్వ’ నామినేషన్ భారీగా తరలివచ్చిన నాయకులు
Advertisement
Photos
View allVideo
View allఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
కాంగ్రెస్కు షాక్.. నామినేషన్ వెనక్కి తీసుకున్న ఇండోర్ అభ్యర్థి
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- ఈ పాపని గుర్తుపట్టారా? లేటెస్ట్ సెన్సేషన్.. రూ.100 కోట్ల మూవీ హీరోయిన్
- నామినేషన్ దాఖలు చేసిన రాజ్నాథ్ సింగ్
- గుడిలో ప్రముఖ నటికి చేదు అనుభవం.. పోస్ట్ వైరల్
- అరుదైన ఘనత సాధించే పనిలో స్టార్ హీరోయిన్ జ్యోతిక
- కొత్తపల్లి గీతకు డిపాజిట్ దక్కేనా?
- హమ్మయ్య బంగారం దిగొచ్చింది! తులం ఎంతంటే..
- శుభకార్యానికి వెళ్తూ అనంతలోకాలకు..
- పెద్దలను ఎదిరించలేక ప్రేమ జంట ఆత్మహత్య
- దాడులు, దౌర్జన్యాలు, దమనకాండే టీడీపీ అజెండా
- ఆందోళనలు ఉద్రిక్తం.. హార్వర్డ్ యూనివర్సిటీలో పాలస్తీనా జెండా
What’s your opinion
is snake reptile?
What is your fav car
ముంబై కెప్టెన్గా హార్దిక్ పాండ్యా నియామకం సరైందేనా?
AP : కూటమి మ్యానిఫెస్టోపై ఏమనుకుంటున్నారు?
నమ్మశక్యం కాని వాగ్దానాలిస్తారు
ఏ పార్టీకి నచ్చిన వాగ్దానాలు వారిస్తారు
Advertisement