సీఎం, మంత్రుల పర్యటనలను అడ్డుకుంటాం | fight for special status | Sakshi
Sakshi News home page

సీఎం, మంత్రుల పర్యటనలను అడ్డుకుంటాం

Aug 9 2016 11:10 PM | Updated on Nov 9 2018 4:59 PM

సీఎం, మంత్రుల పర్యటనలను అడ్డుకుంటాం - Sakshi

సీఎం, మంత్రుల పర్యటనలను అడ్డుకుంటాం

ఏపీకి ప్రత్యేక హోదా కల్పించకపోతే సీఎం, మంత్రుల పర్యటనలను అడ్డుకుంటామని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సలాం బాబు హెచ్చరించారు.

కర్నూలు(న్యూసిటీ): ఏపీకి ప్రత్యేక హోదా కల్పించకపోతే సీఎం, మంత్రుల పర్యటనలను అడ్డుకుంటామని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సలాం బాబు హెచ్చరించారు. మంగళవారం కర్నూలులో వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయం నుండి కలెక్టరేట్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడి గాంధీ విగ్రహం వద్ద మోకాళ్లపై నిలబడి ముఖ్యమంత్రి డౌన్‌..డౌన్‌.. ఆంధ్రుల హక్కు ప్రత్యేక హోదా అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అక్కడి నుంచి కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఓటుకు నోటు కేసులో ఇరుక్కుని ప్రత్యేక హోదాపై నోరు మెదపడం లేదని విమర్శించారు. పోరాటాలతోనే ప్రత్యేక హోదా సాధించుకుంటామన్నారు. ధర్నాలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు అనిల్‌కుమార్, ప్రధాన కార్యదర్శి ఫయాజ్‌ అహ్మద్‌ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement