తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ | Devotees rush to be continued in Tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Aug 16 2016 6:32 AM | Updated on Sep 4 2017 9:31 AM

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీతో అన్ని కంపార్ట్ మెంట్లు నిండి వెలుపలికి క్యూలైన్లో బారులు తీరారు.

తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. శ్రీవెంకటేశ్వరస్వామి వారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో 18 కంపార్ట్మెంట్లు నిండి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ బయటకు క్యూ లైన్లలో బారులు తీరారు. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 6 గంటల, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది.

అయితే మూడు రోజుల పాటు టీటీడీ శ్రీవారి పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్న సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు శ్రీవారి దర్శనానికి తరలివస్తున్నారు. కాగా, నిన్న శ్రీవారిని 97,307 మంది భక్తులు దర్శించుకున్నట్టు టీటీడీ పేర్కొంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement