'అలా చెప్పడం చంద్రబాబు మోసం చేయడమే' | Sakshi
Sakshi News home page

'అలా చెప్పడం చంద్రబాబు మోసం చేయడమే'

Published Mon, Feb 22 2016 3:30 PM

'అలా చెప్పడం చంద్రబాబు మోసం చేయడమే' - Sakshi

విశాఖ : ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వడానికి పొరుగు రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం మోసం చేయడమే అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ...' రాష్ట్ర విభజన పొరుగు రాష్ట్రాలను అడిగి చేశారా?... పార్లమెంట్ సాక్షిగా ప్రకటన చేసి అమలు చేయకపోవడం ప్రజలను దగా చేయడమే.  ఉత్తరాంధ్ర, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీల్లో స్పష్టత లేదు. జిల్లాకు రూ.50 కోట్లు ముష్టిగా పడేశారు, రైల్వే జోన్కు నిధులు ఇవ్వలేదు. చిత్తుశుద్ధి ఉంటే కేంద్రంలో ఉన్న టీడీపీ మంత్రులు రాజీనామా చేయాలి' అని డిమాండ్ చేశారు.


 

Advertisement
Advertisement