కుటుంబ కలహాలు.. దంపతుల ఆత్మహత్య | Couple commits suicide over family dispute | Sakshi
Sakshi News home page

కుటుంబ కలహాలు.. దంపతుల ఆత్మహత్య

Feb 17 2017 10:56 AM | Updated on Jul 10 2019 7:55 PM

వైఎస్సార్‌ కడప జిల్లాలో విషాదం చోటుచేసుకుంది

రాజంపేట(వైఎస్సార్‌జిల్లా): వైఎస్సార్‌ కడప జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని రాజంపేట మండలం మందరం గొల్లపల్లిలో భార్యాభర్తలు వంటి పై కిరోసిన్‌ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్నారు. గ్రామానికి చెందిన వెంకట సుబ్బయ్య(40), వెంకట సుబ్బమ్మ(37) దంపతుల మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి.

ఈ క్రమంలో గురువారం రాత్రి వీరిధ్దరి మధ్య మరోసారి గొడవ జరగడంతో.. మనస్తాపానికి గురై ఇద్దరు కలిసి కిరోసిన్‌ పోసుకొని నిప్పంటించుకున్నారు. వారిని ఆస్పత్రికి తరలించడానికి యత్నించగా.. అప్పటికే మృతిచెందారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement