విషజ్వరంతో బాలుడి మృతి | boy died with viral fever | Sakshi
Sakshi News home page

విషజ్వరంతో బాలుడి మృతి

Dec 7 2016 11:52 PM | Updated on Jul 12 2019 3:02 PM

విషజ్వరంతో గూడూరు పడమర బీసీ కాలనీకి చెందిన నాలుగేళ్ల బాలుడు కిరణ్‌కుమార్‌ మృతి చెందాడు.

గూడూరు: విషజ్వరంతో గూడూరు పడమర బీసీ కాలనీకి చెందిన నాలుగేళ్ల బాలుడు కిరణ్‌కుమార్‌ మృతి చెందాడు.  తల్లిదండ్రులు మంగలి రాజశేఖర్, కాలేశ్వరీ తెలిపిన వివరాలు మేరకు.. ఈ నెల 5న బాలుడికి తీవ్ర జ్వరం రావడంతో స్థానిక ప్రయివేట్‌ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. డెంగీ లక్షణాలు కనిపించడంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే కోలుకోలేక బుధవారం ఉదయం ఆ బాలుడు మృతి చెందాడు. ఈ ఘటనపై స్థానిక వైద్యాధికారి నారాయణ, వైద్య సిబ్బంది పడమర బీసీ కాలనీలో పర్యటించి  బాలుడి మృతదేహాన్ని పరిశీలించారు. బాలుడు మృతి చెందడానికి గల కారణాలను తెలుసుకున్నారు. విషజ్వరంతో బాలుడు మృతి చెందినట్లు విలేకరులకు వైద్యాధికారి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement