కాకతీయ యూనివర్సిటీ పరిధి డిగ్రీ కళాశాలల్లోని బాటనీ అధ్యాపకులకు శనివారం ఓరియెంటేషన్ నిర్వహించనున్నట్లు బాటనీ విభాగం అధిపతి డాక్టర్ వి.కృష్ణారెడ్డి గురువారం తెలిపారు.
బాటనీ అధ్యాపకులకు రేపు ఓరియెంటేషన్
Aug 19 2016 12:42 AM | Updated on Sep 4 2017 9:50 AM
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధి డిగ్రీ కళాశాలల్లోని బాటనీ అధ్యాపకులకు శనివారం ఓరియెంటేషన్ నిర్వహించనున్నట్లు బాటనీ విభాగం అధిపతి డాక్టర్ వి.కృష్ణారెడ్డి గురువారం తెలిపారు. ఉదయం 10–30 గంటలకు క్యాంపస్లోని బాటనీ సెమినార్ హాల్లో కార్యక్రమం ప్రారంభం కానుందన్నారు. సీబీసీఎస్ సెమిస్టర్ విధానం, నూతన సిలబస్పై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. డిగ్రీ కళాశాలల నుంచి 150 మంది బాటనీ అధ్యాపకులు పాల్గొననున్నారని పేర్కొన్నారు.
Advertisement


