భైంసా పట్టణ సమీపంలో గడ్డెన్న వాగు ప్రాజెక్టు వద్ద మినీ ట్యాంక్ బండ్ నిర్మాణానికి ఆర్థిక శాఖ ఆమోదం లభించిందని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి తెలిపారు.
-
ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి
భైంసా : భైంసా పట్టణ సమీపంలో గడ్డెన్న వాగు ప్రాజెక్టు వద్ద మినీ ట్యాంక్ బండ్ నిర్మాణానికి ఆర్థిక శాఖ ఆమోదం లభించిందని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి తెలిపారు. ట్యాంక్ బండ్ నిర్మాణానికి రూ. 3.5 కోట్ల నిధులు విడుదల చేసినట్ల తెలిపారు. మధ్య తరహా ప్రాజెక్టు అయినప్పటికీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్రావు ప్రత్యేక దృష్టి సారించి నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. త్వరలో గడ్డెన్నవాగు ప్రాజెక్టు వద్ద మినీ ట్యాంక్ బండ్ నిర్మాణ పనులు ప్రారంభం కానున్నుట్లు వెల్లడించారు. భైంసా పట్టణ ప్రజలకు డివిజన్ ప్రజలకు ఆహ్లాదం పంచేలా పార్కును నిర్మించి, సుందరీకరణంగా పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. నిధులు మంజూరు చేసినందుకు సీఎం కేసిఆర్, నీటి పారుదల శాఖ మంత్రి హరీష్రావు, ఆర్థిక మంత్రి ఈటేల రాజేందర్కు నియోజకవర్గ ప్రజలు ప్రత్యేక అ«భినందనలు తెలిపారు.