ఆంజనేయస్వామి విగ్రహం లభ్యం | Sakshi
Sakshi News home page

ఆంజనేయస్వామి విగ్రహం లభ్యం

Published Thu, Aug 4 2016 10:24 PM

ఆంజనేయస్వామి విగ్రహం లభ్యం - Sakshi

సంస్థాన్‌ నారాయణపురం: మండలంలోని రాచకొండ అటవీ ప్రాంతం పల్లగట్టుతండానుంచి ఐదుదొనల తండాకు వెళ్లే దారిలో  ఆంజనేయస్వామి విగ్రహాన్ని గురువారం తండావాసులు గుర్తించారు. తండావాసులు తెలిపిన వివరాల ప్రకారం ఎక్కడో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపి, అక్కడి నుంచి ఆంజనేయస్వామి విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ పడేసి ఉంటారని తెలిపారు. ఫారెస్ట్‌ వాచర్‌ సేవ పోలీసులకు, అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఎస్‌ఐ పి.అశోక్‌కుమార్‌ స్థలాన్ని పరిశీలించారు. తండావాసులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. చుట్టుపక్కల తండావాసులు వచ్చి విగ్రహానికి పూజలు నిర్వహించారు.
 

Advertisement
Advertisement