యువకుడిపై యూనివర్సిటీ విద్యార్థుల దాడి | A young man attacked by the students of KL University | Sakshi
Sakshi News home page

యువకుడిపై యూనివర్సిటీ విద్యార్థుల దాడి

Dec 4 2016 1:47 PM | Updated on Nov 9 2018 4:10 PM

యువకుడిపై యూనివర్సిటీ విద్యార్ధులు ఆరుగురు దాడిచేసి తీవ్రంగా కొట్టారు.

తాడేపల్లి(గుంటూరు జిల్లా): గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డేశ్వరం గ్రామం వద్ద డి. సునీల్(24) అనే యువకుడిపై కేఎల్ వర్సిటీకి చెందిన ఆరుగురు విద్యార్థులు దాడిచేసి తీవ్రంగా కొట్టారు. ఈ సంఘటన ఆదివారం మధ్యాహ్నం జరిగింది. ఒక బార్ వద్ద జరిగిన గొడవే ఈ దాడికి కారణమని పోలీసులు చెప్పారు.

సునీల్‌పై దాడిచేసిన ఆరుగురు విద్యార్థులు పరారీలో ఉన్నారు. వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్పారు. గాయపడిన సునీల్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్చారు. అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు.

 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement