పులివెందుల పీఎస్లో చంద్రబాబుపై ఫిర్యాదు | Sakshi
Sakshi News home page

పులివెందుల పీఎస్లో చంద్రబాబుపై ఫిర్యాదు

Published Wed, Jun 8 2016 10:03 AM

A case filed against chandrababu in Pulivendula Police station

పులివెందుల: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన మోసాలపై వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో వైఎస్ఆర్సీపీ నేతలు భారీ ర్యాలీ చేస్తున్నారు. వైఎస్ఆర్ సీపీ నేతలు పులివెందుల పీఎస్ లో చంద్రబాబు మోసాలపై ఫిర్యాదు చేశారు. వైఎస్ఆర్ సీపీ నేతలు వైఎస్ వివేకానందరెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి, ఇతర నేతలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. నేడు చంద్రబాబు మోసాలపై ఏపీలోని అన్ని జిల్లాల్లో ఆయనపై కేసులు నమోదు చేసేందుకు ప్రతిపక్ష వైఎస్ఆర్ సీపీ పిలుపునిచ్చింది. ఇందులో భాగంగానే పులివెందులలో ఆ పార్టీ కీలక నేతలు భారీ ర్యాలీ చేపట్టారు. నేడు వైఎస్ఆర్ సీపీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో ఏపీ సీఎం మోసాలపై ఫిర్యాదులు చేయనున్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement