నాటా తెలుగు మహాసభలకు సినీ తారలు | Sakshi
Sakshi News home page

నాటా తెలుగు మహాసభలకు సినీ తారలు

Published Tue, May 24 2016 2:35 AM

Telugu Film stars to NATA Mahasabha

సాక్షి, హైదరాబాద్: ఉత్తర అమెరికాలోని డల్లాస్‌లో ఈ నెల 27 నుంచి 29 వరకు జరగనున్న నాటా తెలుగు మహాసభల్లో ప్రముఖ తెలుగు సినీ తారలు పాల్గొననున్నట్లు నాటా అధ్యక్షుడు డాక్టర్ మోహన్ మల్లం, మహాసభల కన్వీనర్ డాక్టర్ గూడూరు రమణారెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.

నటులు వరుణ్‌తేజ్, సుధీర్‌బాబు, రకుల్ ప్రీత్‌సింగ్, నిత్యామీనన్, ప్రణీత, మోడల్ మాధురి ఇతాగి, నందిని రాయ్, సియా గౌతమ్, రచన మౌర్య, సునీత వర్మ, తేజస్విని తదితరులు హాజరుకానున్నట్లు వెల్లడించారు. అలాగే దర్శకులు కోదండరామిరెడ్డి, ఆదిత్య, సీవీ రెడ్డి, హరీశ్ శంకర్, మేర్లపాక గాంధీ, నిర్మాత మధుర శ్రీధర్ తదితరులు తమ అనుభవాలను పంచుకుంటారని సాంస్కృతిక కార్యక్రమాల నిర్వాహకుడు డాక్టర్ నాగిరెడ్డి, సమన్వయకర్త రామసూర్యారెడ్డి, సహ కన్వీనర్ శ్రీధర్‌రెడ్డి తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement